Uncategorized

Sree Vishnu, Hasith Goli, People Media Factory and Abhishek Agarwal Art LLP. Film Launched

శ్రీవిష్ణు’ హీరోగా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,అభిషేక్ అగర్వాల్  ఆర్ట్స్’ ఎల్.ఎల్.పి. చిత్రం ప్రారంభం

యువ కథానాయకుడు శ్రీవిష్ణు  హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో
ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఎల్.ఎల్.పి.  నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు  నేడు సంస్థ కార్యాలయంలో జరిగాయి. శ్రీవిష్ణు హీరోగా ఇటీవల విడుదల అయి ఘన విజయం సాధించిన ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వ టీమ్ లో ప్రతిభ కనబరచిన ‘హాసిత్ గోలి’ ని ఈ చిత్రం ద్వారా దర్శకునిగాపరిచయం చేస్తున్నారు చిత్ర నిర్మాతలు  టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్.

వినోదం తో కూడిన డ్రామా ఈ చిత్ర కధలో వైవిధ్యంగా సాగుతుందని తెలిపారు చిత్ర దర్శకుడు హాసిత్ గోలి.

శ్రీవిష్ణు,హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నెలలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంగీతం వివేకసాగర్, ఛాయాగ్రహణం వేదరామన్. ఇక చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఈ చిత్రానికి  సహ నిర్మాతలు వివేక్ కూచి భొట్ల, కీర్తి చౌదరి.

 vivek kuchibhotla,T.G.Viswaprasad,sri vishnu, kerti chowdari, director Haasitgoli P1016380 P1016379 P1016361 P1016341 P1016334
Sree Vishnu, Hasith Goli,  People Media Factory and Abhishek Agarwal Art LLP. Film Launched

Sree Vishnu, known for doing different and contemporary films is teaming up with debut director Hasith Goli who worked as associate director for Mental Madhilo and Brochevarevaru Ra.

The film billed to be a comedy drama has been launched today with a formal pooja at the film’s office. Regular shoot wil commence from January.

Music for the film will be scored by Vivek Sagar, wherein cinematography will be handled by Vedaraman.

TG Vishwa Prasad and Abhishek Agarwal will be producing the film under People Media Factory and Abhishek Agarwal Art LLP. Vivek Kuchibhotla and Keerthi Chowdary are co producers.

Madhavan in “Nissabdham”

He will steal your heart away with his charm. Meet Anthony, a celebrity musician!  #MadhavanAsAnthony #Nishabdham

@ActorMadhavan #AnushkaShetty @hemantmadhukar @peoplemediafcy @KonaFilmCorp @nishabdhammadhavan firstlook- ENG madhavan firstlook- Telugu

‘శ్రీవిష్ణు’ హీరోగా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ చిత్రం


People Media & aa arts
‘శ్రీవిష్ణు’ హీరోగా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,అభిషేక్ అగర్వాల్  ఆర్ట్స్’ చిత్రం
ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. యువ కథానాయకుడు శ్రీవిష్ణు  హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. శ్రీవిష్ణు హీరోగా ఇటీవల విడుదల అయి ఘన విజయం సాధించిన ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వ టీమ్ లో ప్రతిభ కనబరచిన ‘హాసిత్ గోలి’ ని ఈ చిత్రం ద్వారా దర్శకునిగాపరిచయం చేస్తున్నారు చిత్ర నిర్మాతలు  టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్.
శ్రీవిష్ణు,హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్  ఈ ఏడాది చివరిలో  ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఈ చిత్రానికి  సహ నిర్మాతలు వివేక్ కూచి భొట్ల, కీర్తి చౌదరి
Sree vishnu in People Media Factory and Abhishek Agarwal arts next
Popular Tollywood production houses People Media Factory and Abishek Agarwal Arts are joining hands and bankrolling a new project in Telugu. ‘Brochevarevarura’ actor Sree Vishnu has been signed on to play the lead role for the film which will be directed by debutante Hasith Goli. Interestingly, Hasith was part of Sree Vishnu’s previous hits like ‘Mental Madhilo’ and ‘Brochevarevarura’ and worked in the direction team alongside Vivek Athreya.
Producers TG Vishwa Prasad and Abhishek Agarwal are quite elated to join hands for the project which has such elite names. With a soulful story, the shooting of this yet untitled film will go on floors towards the end of the year. Details about the complete cast and crew will be announced by the makers in the near future. The film have Vivek Kuchibhotla and Keerthi Chowdary as co-producers onboard.

షూటింగ్ జరుపుకుంటున్న ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావో తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం


షూటింగ్ జరుపుకుంటున్న ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు
డ్వేన్ బ్రావో తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం 
ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావో తో ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోష‌ల్ అవేర్నేష్ ఫిల్మ్ ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం ఎంట‌ర్ టైన్మెంట్ మూవీస్ మాత్ర‌మే కాకుండా… అన్ని ర‌కాల జోన‌ర్స్ లో విభిన్న క‌థా చిత్రాల‌ను అందించాల‌నేదే పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఉద్దేశ్యం. అందులో భాగంగానే ‘ఎం.ఎల్.ఎ, వైఫ్ ఆఫ్ రామ్, గూఢ‌చారి, ఓ..బేబి…ఇలా వైవిధ్య‌మైన, విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించి అన‌తి కాలంలోనే అటు ఆడియ‌న్స్ లో, ఇటు ఇండ‌స్ట్రీలో అభిరుచి గ‌ల నిర్మాణ సంస్థ‌గా మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ. ప్ర‌స్తుతం విక్ట‌రీ వెంక‌టేష్ – యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య‌ల క్రేజీ కాంబినేష‌న్ లో భారీ మ‌ల్టీస్టార‌ర్ ‘వెంకీ మామ’ చిత్రాన్ని,  అలాగే అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో ‘నిశ్శ‌బ్దం’ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీని కూడా నిర్మిస్తుంది.

అయితే… కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, సామాజిక స్పృహ కు సంబంధించిన విషయాలలో కూడా ప్రజలలో అవగాహన కల్పించాల‌నే స‌దుద్దేశ్యంతో సోష‌ల్ అవేర్నెస్ ఫిల్మ్స్ ను నిర్మిస్తున్నారు  సంస్థ నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల. ఈ నిర్మాణ సంస్థ‌తో ఎ.ఎన్.టి ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ క‌లిసి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సోష‌ల్ అవేర్న‌ష్ ఫిల్మ్ ను నిర్మిస్తోంది.

‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)’ లో భాగంగా వెస్ట్ ఇండీస్ క్రికెట‌ర్ డ్వేన్ బ్రావోతో క‌లిసి ఈ సినిమాని నిర్మిస్తుంది.  ఈ మూవీకి ఆర్తి శ్రీవాత్స‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  ఆమె ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ల్యాండ్ ఆఫ్ విడోస్ మరియు వైట్ నైట్ ఈ రెండు డాక్యుమెంట‌రీస్ ఇంట‌ర్నేష‌న‌ల్  ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ లో అవార్డులు గెలుచుకున్నాయి. ఇప్పుడు మ‌హిళల‌కు శుభ్ర‌త విష‌యంలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు గాను ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

 
డ్వేన్ బ్రావో తన అధికారిక సోషల్ మీడియా ఖాతా అయినా పేస్ బుక్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.
ఈ చిత్ర విశేషాల‌ను ద‌ర్శ‌కురాలు ఆర్తి శ్రీవాత్స‌వ తెలియ‌చేస్తూ…డ్వేన్ బ్రావోతో క‌లిసి ఈ సినిమాని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగాను, గ‌ర్వంగాను ఉంది.  జులైలో త‌మిళ‌నాడులో షూటింగ్ జరిగింది. దీంతో ఇండియ‌లో షూటింగ్ పూర్త‌య్యింది. ఆగ‌ష్టులో వెస్ట్ ఇండీస్ లోని ట్రినిడాడ్, టోబాగో ల‌లో  షూటింగ్ చేయ‌నున్నాం అని చెప్పారు.

ఈ మూవీకి నిర్మాత – టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, కో – ప్రొడ్యూస‌ర్ – వివేక్ కూచిభోట్ల‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – శ్రీ న‌ట‌రాజ్, ప్రాజెక్ట్ డిజైన్ & ఎగ్జిక్యూష‌న్ – ఎ.ఎన్.టి ప్రొడక్ష‌న్స్.

The world-famous West Indies cricketer Dwayne Bravo has collaborated with renowned production company People Media Factory and ANT productions to make a social awareness film. People Media Factory has garnered abundant fame in less span of time with its extraordinary film making.
Entertainment is always been our priority, but also, we have believed in interesting films and genres. We always wanted to tell interesting stories like Wife of Ram, Goodachari, and Oh Baby. We continue to make movies with exceptional stories, the line up of movies which include the most awaited film in Telugu Venky Mama and International film Silence. As a part of our contribution to society we bring this much needed film of the hour “Men Take Lead”.

 Dwayne Bravo   has released the poster of short film where he plays a keyrole, posted in his fb account


Happy to reveal the poster of “Men Take Lead” my upcoming docu-feature. I always wanted to help the young girls and women in my country and elevate the quality of their lives. So excited that it is becoming a reality through this social awareness film. Dedicating this film to all the women around the world. New Beginnings!!! #Menstrualhygiene #womenshealth #periodpoverty
#itsnottattaboo#MHM #Champion #WakeUp #RunDWorld. #People Media Factory

 As a part of corporate social responsibility(CSR), the People Media Factorty has teamed up with West Indies cricketer Dwayne Bravo and producing this movie. Arthi Srivastava will be directing the film. The documentaries Land of Widows and White Knight, helmed by her bagged many awards at International Film Festivals. Now the film is being made to educate women on the matter of cleanliness.
Director Arti Srivastava said, ‘the film was shot in Tamil Nadu in July. The shooting in India has been completed. We will be shooting in Trinidad and Tobago in the West Indies in August.

Producer-TG Viswa Prasad, Co-Producer – Vivek Kuchibhotla, Executive Producer – Sri Nataraj, Project Design and Execution-ANT Productions

హరిరామజోగయ్య గారు త్వరగా కోలుకోవాలి: శ్రీ పవన్ కల్యాణ్


హరిరామజోగయ్య గారు త్వరగా కోలుకోవాలి

09678 (1) 09678 (2) 09678 (3) 09678 (4) 09678 (5) 09678 (6)

హరిరామజోగయ్య గారు త్వరగా కోలుకోవాలి

• నాకు మార్గదర్శకులుగా వ్యవహరించాలి

• జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు

జనసేన పార్టీ హితం కోరుకొనే శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారు త్వరగా కోలుకోవాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆకాంక్షించారు. నాకు, పార్టీకి మార్గదర్శకులుగా వ్యవహరించాలని కోరితే వారు అందుకు అంగీకారం తెలిపారని చెప్పారు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ శ్రీ హరిరామ జోగయ్య అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం శ్రీ పవన్ కల్యాణ్ గారు శ్రీ హరిరామ జోగయ్యను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అక్కడి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “నిబద్ధత కలిగిన హరిరామ జోగయ్య గారు నరసాపురం పార్లమెంట్ సభ్యులుగా 2004-09 కాలంలో ఉండి, మా కుటుంబం కోసం రాజీనామా చేసి వచ్చారు. అనుభవజ్ఞులైన వారి సలహాలు, ఆశీస్సులు అవసరమని పోరాటయాత్ర సమయంలో పాలకొల్లు వెళ్ళి కలిశాను. ఇప్పుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పటికి కూడా జనసేన పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయం గురించి చర్చించారు. హరిరామ జోగయ్యగారు నాకు మార్గరదర్శకులుగా ఉంటారు.

• జనసేన అధ్వర్యంలో పాలకొల్లులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పాలకొల్లు నుంచి ఎందరో వచ్చారు. అల్లు రామలింగయ్య గారు, దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు… ఇలా చాలామంది పాలకొల్లు నుంచి వచ్చినవారే. నవతరంలో ఉన్న నైపుణ్యాన్ని తీర్చిదిద్దేలా పాలకొల్లులో శ్రీ ఎస్.వి.రంగారావు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ను జనసేన అధ్వర్యంలో నెలకొల్పనున్నాం. ఈ ఇన్స్టిట్యూట్ కి హరిరామ జోగయ్య గారు ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. వీరు నిర్మాతగాను ఎన్నో  మంచి చిత్రాలు అందించారు. రాజా వన్నెంరెడ్డి, బన్నీ వాసు నేతృత్వంలో నడుస్తుంది. ఇందుకు నా అండదండలు ఉంటాయి. ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల యువతకు ఉపయోగపడేలా ఉంటుంది” అన్నారు.

శ్రీ హరిరామ జోగయ్య మాట్లాడుతూ “చిరంజీవిగారు కుటుంబం అంటే నాకు ఎంతో ఇష్టం. పవన్ కల్యాణ్ గారికి అభిమానిని. జనసేన పార్టీకి ఎప్పుడూ నా సహాయసహకారాలు ఉంటాయి. చివరి శ్వాస వరకూ జనసేన కోసమే పని చేస్తాను. ప్రజలందరి క్షేమం కోరుకొంటూ… అందరినీ సురక్షితంగా చూసుకొనే పార్టీ ఇది. అందరం శ్రీ పవన్ కల్యాణ్ గారు వెన్నంటి నడుద్దాం. పాలకొల్లు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ ఇస్తాం. రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తారు. శిక్షణ విధానం, ఫ్యాకల్టీ సిద్ధం అయింది. ఈ శిక్షణాలయం ప్రారంభానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు వస్తారు” అని చెప్పారు.