ఈ సందర్భంగా నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 30 తో చిత్రం షూటింగ్ ముగుస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఫిలింసిటీ లో శ్రీకాంత్ పై ఓ సందర్భోచిత గీతాన్ని స్వర్ణ మాస్టర్ నృత్య దర్సకత్వంలో చిత్రీకరిస్తున్నాము. అలాగే కధానాయకుని చిన్న తనానికి సంభందించిన దృశ్యాలను చిత్రీకరించాము. ఎడిటింగ్ వర్క్ కూడా ప్రారంభమయింది. ఈ నెల 28 నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభ మవుతాయి. జులై నెలాఖరున గానీ,ఆగస్టు ప్రధమార్ధంలో గానీ చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నట్లు నిర్మాత తెలిపారు.
కధానాయకుడు శ్రీకాంత్ ‘దొంగ’ గా, నాయిక ‘టీచర్’ గా కనిపించే ఈ చిత్రంలోని
ఇతర ప్రధాన పాత్రలలో పోసానిక్రిష్ణమురలి,చిత్రంశ్రీను,రవివర్మ,కారుమంచి రఘు, డా.రవిప్రకాష్,లు నటిస్తున్నారు.
కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి: సంగీతం: సాయికార్తీక్:పాటలు: శ్యాం కాసర్ల ఎడిటింగ్: నాగిరెడ్డి : సమర్పణ: జ్యోత్స్నారెడ్డి : నిర్మాత: రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి:
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: జర్నలిస్ట్ ప్రభు
Follow Us!