About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

Sitara Entertainments upcoming movie in the combination of Siddhu jonnalagadda and Shraddha Srinath

సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ లో ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ చిత్రం

* ‘నరుడి బ్రతుకు నటన’ గా చిత్రం పేరు ఖరారు
* ఆకర్షణీయమైన లోగోతో కూడిన ప్రచార చిత్రం విడుదల
* దీపావళి కి షూటింగ్ ప్రారంభం

టాలీవుడ్ లోని  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించింది. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రద్ధ శ్రీనాధ్ నాయికగా ఈ చిత్రం రూపొందనుంది. వీరిద్దరూ కలసి నటించిన కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. అంతేకాదు సిద్ధు జొన్నలగడ్డ ఈ  చిత్రంతో ఇటు టాలీవుడ్ లోను, అటు ప్రేక్షక వర్గాలలోనూ ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.ఇప్పుడు వీరిద్దరి విజయవంతమైన కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్ మెంట్స్ ఈ  చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తోంది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ.

సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ లో’ రూపొందనున్న ఈ చిత్రానికి ‘నరుడి బ్రతుకు నటన’ అనే పేరును ఖరారు చేసినట్లు సంస్థ ప్రకటించింది. అంతేకాదు… ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రచార చిత్రాన్ని కూడా ఈరోజు  సాయంత్రం గంటలు 4.05 నిమిషాలకు విడుదల చేశారు.
చిత్రం పేరు, లోగో, ఆకర్షణీయమైన, ఉత్సుకతను కలిగించే చిత్రం ఇందులో కనిపిస్తాయి.ప్రచార చిత్రాన్ని నిశితంగా గమనిస్తే.. సంగీతానికి ఈ చిత్రకధకు సంభంధం ఉందన్నట్లు హెడ్ ఫోన్స్, హృదయం రూపంలో  ఓ జంట లోకాన్ని మరచిపోయి దగ్గరగా ఉండటం ఇది ప్రేమ కథాచిత్రమా అనిపిస్తుంది. సహజంగా హార్ట్ సింబల్ రెడ్ కలర్ లో ఉంటుంది. కానీ ఈ చిత్రంలో ఇది బ్లూ కలర్ లో కనిపిస్తుంది…ఇలా ఎందుకు…? ప్రేమ కధకుమించి  ఈ చిత్రంలోఇంకేదో ఉంది అనిపిస్తుంది. అదేమిటో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే..వేచి చూడాల్సిందే…! చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు, వివరాల కోసం నిర్మాణ సంస్థకు సంబంధించిన సామాజిక మాధ్యమం ఖాతాను గమనిస్తూ ఉండండి.

పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో,నిర్మాతసూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది  దీపావళి కి  ప్రారంభం అవుతుంది.
‘నరుడి బ్రతుకు నటన‘ చిత్రానికి
రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: కాలభైరవ
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: విమల్ కృష్ణ

Sitara Entertainments upcoming movie in the combination of Siddhu jonnalagadda and Shraddha Srinath


• “Narudi Brathuku Natana” is the title of the film.
. An attracting and intresting poster is released at 4.05 pm
• Shoot starts from Diwali.

Leading Production house in Tollywood has announced their Upcoming film. Young and promising Hero siddhu jonnalagadda and Heroine Shraddha Srinath are pairing up once again after krishna and his leela. Both are riding high on the success of krishna and his leela which is very well received by the audience all over. Siddhu jonnalagadda made himself a mark with krishna and his leela, as promising hero in Tollywood as well as among general public. Sithara entertainments is now producing a film in this successful combination. Producer Suryadevara nagavamsi is introducing a young and talented director named Vimal Krishna with this movie. Vimal Krishna, previously worked in the direction team of krishna and his leela as well.
The team has zeroed in on “Narudi Brathuku Natana” as the title for this movie starring Siddhu Jonnalagadda and Shraddha Srinath. An attracting and intresting poster is released at 4.05 pm today.
A closer look at the poster, it shows a couple in an intimate space, indicating a love story probably, but the heart is bleeding blue, WHY? With the title being narudi brathuku natana, may be the protagonist goes through a bumpy ride in his life. It looks like there is more to the story than just love. We must wait and watch for it.

Producer Suryadevara nagavamsi has said that the shoot commences from Diwali. This movie is being presented by P.D.V. PRASAD.

Narudi Brathuku Natana Movie Details :

Cast : Siddhu Jonnalagadda, Shraddha Srinath

Writer: Vimal Krishna, Siddhu Jonnalagadda
Music : Kaala Bhairava
DOP : Saiprakash Ummadisingu
Executive Producer: Dheeraj Mogilineni

Banner : Sithara Entertainments
Presenter: PDV Prasad
Producer : Suryadevara Naga Vamsi
Director : Vimal Krishna

details copy NBN Logo

Prakash Raj helps West Godavari student to pursue overseas studies

పేద విద్యార్థిని పాలిట ఆప‌ద్బాంధ‌వుడైన ప్ర‌కాష్‌రాజ్‌.. మాంచెస్ట‌ర్ యూనివ‌ర్సిటీలో మాస్ట‌ర్స్ డిగ్రీ చ‌దివించ‌డానికి ఏర్పాట్లు!

ఎదుటివాళ్ల‌కు సాయం చేయాల‌నే మంచి హృద‌యం ఉన్న‌వాళ్ల‌లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ ఒక‌రు. ఈ లాక్‌డౌన్ కాలంలో క‌ష్టాల్లో ఉన్న‌వాళ్ల‌కు త‌న వంతు సాయం చేస్తూ వ‌స్తున్నారు. వ‌ల‌స కార్మికుల‌కు ఆప‌న్న హ‌స్తం అందించిన ఆయ‌న, స్కూలు మిస్స‌వుతున్న పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పించే బాధ్య‌త‌ను కూడా తీసుకున్నారు. అలాగే తెలంగాణ‌లో ఒక గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని త‌న ఉదాత్త హృద‌యాన్ని చాటుకున్నారు.తాజాగా ఆయ‌న ఓ బ్రిలియంట్ స్టూడెంట్‌కు మాస్ట‌ర్స్ డిగ్రీ చేయ‌డానికి అవ‌స‌ర‌మైన ఆర్థిక సాయాన్ని చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. ప‌శ్చిమ గోదావ‌రికి జిల్లాకు చెందిన సిరిచంద‌న స్కూలు నుంచే అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌నప‌రుస్తూ బీఎస్సీ కంప్యూట‌ర్ సైన్స్ పూర్తి చేసింది. ఆమెకు మాంచెస్ట‌ర్‌లోని  యూనివ‌ర్సిటీ ఆఫ్ సాల్‌ఫోర్డ్‌లో ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో మాస్ట‌ర్స్‌ డిగ్రీ చేయ‌డానికి సీటు వ‌చ్చింది. ఆమెకు తండ్రి లేడు. ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రం. అక్క‌డ‌కు వెళ్ల‌డానికి ఆశ‌లు వ‌దిలేసుకున్న ఆమె పాలిట ఆప‌ద్బాంధ‌వుడ‌య్యారు ప్ర‌కాష్‌రాజ్‌. ఆమెను మాంచెస్ట‌ర్ యూనివ‌ర్సిటీలో చ‌దివించ‌డానికి ముందుకు వ‌చ్చారు. దీంతో సిరిచంద‌న‌, ఆమె త‌ల్లి ఆనందాన్ని అవ‌ధులు లేవు. హైద‌రాబాద్‌లో షూటింగ్‌లో ఉన్న ప్ర‌కాష్‌రాజ్‌ను క‌లుసుకొని, త‌మ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఆమెను బాగా చ‌దువుకొని, వృద్ధిలోకి రావాల్సిందిగా ప్ర‌కాష్‌రాజ్ ఆశీర్వ‌దించారు.

ఈ సంద‌ర్భంగా సిరిచంద‌న మాట్లాడుతూ, “నాపేరు తిగిరిప‌ల్లి సిరిచంద‌న‌. మాది ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పెద్దేవం గ్రామం. నేను డిగ్రీ కంప్యూట‌ర్ సైన్స్‌ చ‌దువుకున్నాను. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో మాస్ట‌ర్స్‌ డిగ్రీ చేయ‌డానికి మాంచెస్ట‌ర్‌లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ సాల్‌ఫోర్డ్‌లో సీటు వ‌చ్చింది. నాకు తొమ్మిదేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు మా నాన్న‌గారు చ‌నిపోయారు. అప్ప‌ట్నుంచీ మా అమ్మే క‌ష్ట‌ప‌డి మ‌మ్మ‌ల్ని చ‌దివించి ఇక్క‌డి దాకా తీసుకువ‌చ్చింది. యూనివ‌ర్సిటీలో సీటు వ‌చ్చిన‌ప్పుడు అక్క‌డికి వెళ్ల‌డానికి నేను ధైర్యం చెయ్య‌లేదు. ఎందుకంటే ఆర్థికంగా మా కుటుంబం ప‌రిస్థితి నాకు తెలుసు కాబ‌ట్టి. న‌రేంద్ర అనే మా శ్రేయోభిలాషి ఒక‌రు నా గురించి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన‌ప్పుడు, ప్ర‌కాష్‌రాజ్ గారు అదిచూసి, త‌న‌కు నేను హెల్ప్ చేస్తాను, త‌ను బాగా చ‌దువుకోవాలి అని ముందుకు వ‌చ్చారు. అన్ని ఖ‌ర్చులు ఆయ‌నే భ‌రిస్తున్నారు. ఆయ‌న ఇచ్చిన ప్రేర‌ణ‌తో నేను బాగా చ‌దువుకొని, నాలాంటి స్థితిలో ఉన్న మ‌రో న‌లుగురికి సాయం చేయాల‌ని అనుకుంటున్నా. నిజానికి మాంచెస్ట‌ర్ యూనివ‌ర్సిటీలో చ‌దువుకొనే స్థాయి మాకు లేదు. కానీ ఆర్థికంగా, నైతికంగా ప్ర‌కాష్‌రాజ్ గారు ఇచ్చిన స‌పోర్ట్ ఎన్న‌టికీ మ‌ర్చిపోలేం. బుక్స్ ద‌గ్గ‌ర్నుంచి కంప్యూట‌ర్ దాకా ఆయ‌నే స‌మ‌కూర్చి పెట్టారు. క‌చ్చితంగా ఈ విష‌యంలో ఆయ‌న‌ను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుంటాను. ఎప్ప‌టికీ ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంటాను.” అని చెప్పింది.

సిరిచంద‌న వాళ్ల‌మ్మ ఉద్వేగంతో మాట్లాడుతూ, “నా పిల్ల‌లు చిన్న‌వాళ్లుగా ఉన్న‌ప్పుడే నా భ‌ర్త చ‌నిపోయారు. అప్ప‌ట్నంచీ అష్ట‌క‌ష్టాలు ప‌డి నా పిల్ల‌ల్ని పోషిస్తూ, చ‌దివించుకుంటూ వ‌చ్చాను. మాకు ఆస్తిపాస్తులు లేవు, వెనుకా ముందూ ఎవ‌రూ లేరు. నా రెక్క‌లే ఆధారం. పాప‌కు పీజీలో సీటు వ‌చ్చిన‌ప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా బాధేసింది. ప్ర‌కాష్‌రాజ్ గారికి నా బిడ్డ విష‌యం తెలిసి, త‌న బాధ్య‌తంతా ఆయ‌న తీసుకున్నారు. సిరిచంద‌న‌ను తాను చూసుకుంటాన‌నీ, చ‌దివిస్తాన‌నీ చెప్పారు. త‌న‌కో కూతురుంద‌నీ, సిరిని రెండో కూతుర‌నుకుంటాన‌నీ అన్నారు. ‘నువ్వు నా చెల్లెలివ‌మ్మా బాధ‌ప‌డ‌కు’ అని నాకు ధైర్యమిచ్చారు. ఏమిచ్చినా ఆయ‌న రుణం తీర్చుకోలేం. ఒక పెద్ద‌న్న‌లా ఆయ‌న న‌న్ను న‌డిపిస్తున్నారు.” అన్నారు.

Prakash Raj helps West Godavari student to pursue overseas studies

Veteran actor Prakash Raj is a man of words. Off the screen, he is a different person and believes in giving what life has given to him. During the pandemic lockdown, we have seen Prakash Raj taking care of the migrant labourers and now here is yet another tale of his helping nature.

Prakash Raj provided financial support to a girl who hails from West Godavari district. Into the story, Tigiripalli Siri Chandana is a bright student. Having graduated in Computer Science, she managed to get a seat in the prestigious University of Salford, Manchester city, UK. However due to her poor financial background she could not lay a step forward and was in the verge of giving up.

But this tale of Chandana reached Prakash Raj and he immediately came forward to support her. Keeping his word, Prakash Raj paid the tuition fee and living expenses of Chandana in UK. Receiving the help, Chandana met Prakash Raj and thanked him for all the invaluable help.

Speaking on this Chandana said, “My father passed away when I was 9 years old. Since then my mother was taking care of my family. After my graduation, I wanted to do post-graduation in information technology. But I can’t afford the overseas education and through a person, Prakash Raj sir came forward to help me. He took care of everything from college fee to my day-to-day expenses. I’m indebted to Prakash Raj sir but the most important thing I have learnt from him is, to help others who are like me out there.”

Adding Chandana further said that Prakash Raj filled the role of my father. This gesture from a great personality like him, I would never ever forget in my life.

Chandana’s mother got a little emotional while speaking. “I have worked very hard to give my children a good life. I have no one to support and not even assets to rely on. Prakash Raj garu came in like a ray of hope. He assured all the possible help and like a big brother to me, he helped my daughter to pursue her dreams. Thank you is a small word for what Prakash Raj garu has done for my daughter.”

Irrespective of the affiliations, Prakash Raj made the slogan ‘Beti Bachao.. Beti Padao..’ come true. Respect!

PHOTO-2020-10-03-18-19-53 PHOTO-2020-10-03-18-19-52

Aravind Swamy and Jayam Ravi’s Bogan Telugu Trailer out now

జ‌యం’ ర‌వి, ‘అర‌వింద్‌స్వామి’ ల సూప‌ర్‌హిట్ సినిమా ‘బోగ‌న్‌’ ట్రైల‌ర్ విడుద‌ల‌

ఇటీవ‌ల ‘బోగ‌న్’ చిత్రాన్ని రామ్ తాళ్లూరి తెలుగులో అందిస్తున్నార‌నే ప్ర‌క‌ట‌న రాగానే, ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన అమేజింగ్‌ రెస్పాన్స్ చూశాక‌, ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నామ‌నే న‌మ్మ‌కం మ‌రింత‌గా పెరిగిందని నిర్మాత తెలిపారు.

‘బోగ‌న్’ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్‌తో ఎస్.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి అందిస్తున్నారు. ఇప్ప‌టికే అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి.

ఈరోజు (గురువారం)ఉద‌యం 11 గంట‌ల‌కు బోగ‌న్ ట్రైల‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. సాధార‌ణంగా యాక్ష‌న్ సీన్లు టెర్రిఫిక్‌గా ఉంటాయంటాం. బోగ‌న్‌లో యాక్ష‌న్ సీన్లు మాత్ర‌మే కాదు, క‌థ‌ను న‌డిపించే అనేక సీన్లు టెర్రిఫిక్‌గా ఉంటాయ‌ని ఈ ట్రైల‌ర్‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది.

ట్రైల‌ర్‌ని చూస్తుంటే సినిమాలో మ‌న ఊహ‌కు అంద‌ని ట్విస్టులు అనేకం ఉన్న‌ట్లు తెలుస్తోంది. జ‌యం ర‌వి త‌న ద‌గ్గ‌ర‌కు రివాల్వ‌ర్‌ ప‌ట్టుకొని వెరైటీగా న‌డుస్తూ వ‌స్తుంటే హ‌న్సిక ఫోన్‌లో ఏడుస్తూ “విక్ర‌మ్‌.. ఆదిత్య ఇక్క‌డ‌కు వ‌చ్చేశాడు.. భ‌యంగా ఉంది.. త్వ‌ర‌గా రా” అన‌డం, కారులో ఉన్న అర‌వింద్ స్వామి “వ‌స్తున్నా వ‌స్తున్నా” అన‌డం చూస్తుంటే ట్విస్టులు ఏ రేంజిలో ఉంటాయో అర్థ‌మ‌వుతోంది. అలాగే ట్రైల‌ర్ చివ‌ర‌లో అర‌వింద్ స్వామి “ఆదిత్యా” అని కోపంతో పెద్ద‌గా అర‌వ‌డం కూడా ఈ ట్విస్టులో భాగ‌మే. ఎందుకంటే ఆదిత్య పాత్ర‌ను చేసింది అర‌వింద్ స్వామి అయితే, విక్ర‌మ్ పాత్ర‌ను చేసింది జ‌యం ర‌వి. మ‌రి జ‌యం ర‌విని చూసి హ‌న్సిక ఎందుకు భ‌య‌ప‌డుతోందో, అర‌వింద్ స్వామి “ఆదిత్యా” అని ఆవేశంగా ఎందుకు కేక పెట్టాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఒక బ్యాంక్ దొంగ‌త‌నం కేసును ద‌ర్యాప్తు చేస్తూ, ఆదిత్య అనే నిందితుడిని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే విక్ర‌మ్ అనే పోలీసాఫీస‌ర్ క‌థ ‘బోగ‌న్’ చిత్రం. త‌న‌కు చిక్క‌కుండా త‌ప్పించుకుంటున్న ఆదిత్య‌ను ఒక అద్భుత ప్లాన్‌తో విక్ర‌మ్ ప‌ట్టుకోవ‌డం టెర్రిఫిక్ ఇంట‌ర్వెల్ బ్లాక్‌. ఆ త‌ర్వాత క‌థ ప్రేక్ష‌కులు ఊహించ‌ని మ‌లుపులు తిరిగి, అనుక్ష‌ణం కుర్చీల‌లో మునివేళ్ల‌పై కూర్చోపెట్టేలా క‌థ‌నం ప‌రుగులు పెడుతుంద‌ని ట్రైల‌ర్ తెలియ‌జేస్తోంది.

ల‌క్ష్మ‌ణ్ స్క్రీన్‌ప్లే, సౌంద‌ర్‌రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ, డి. ఇమ్మాన్ మ్యూజిక్ క‌లిసి ఈ మూవీని ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా త‌యారుచేశాయి. విక్ర‌మ్ ఐపీఎస్‌గా జ‌యం ర‌వి, ఆదిత్య‌గా అర‌వింద్ స్వామి.. ఇద్ద‌రూ ఇద్ద‌రే అన్న‌ట్లు ఫెంటాస్టిక్‌గా న‌టించిన ఈ సినిమా ఒక హాలీవుడ్ థ్రిల్ల‌ర్ చూసిన ఫీలింగ్‌ను క‌లిగిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

‘త‌ని ఒరువ‌న్’ త‌ర్వాత ‘జ‌యం’ ర‌వి, అర‌వింద్ స్వామి కాంబినేష‌న్‌లో రూపొంది సూప‌ర్‌హిట్ట‌యిన మ‌రో సినిమానే  ఈ  ‘బోగ‌న్‌’. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీని డైరెక్ట‌ర్‌ ల‌క్ష్మ‌ణ్ రూపొందించారు. త‌క్కువ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా త‌మిళంలో రూ. 25 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది.

హీరోయిన్‌గా హ‌న్సికా మొత్వాని న‌టించిన ఈ చిత్రంలో నాజ‌ర్‌, పొన్‌వ‌ణ్ణ‌న్‌, న‌రేన్‌, అక్ష‌ర గౌడ ఇత‌ర పాత్ర‌ధారులు. డి. ఇమ్మాన్ సంగీతం స‌మ‌కూర్చ‌గా, సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు.

త్వ‌ర‌లోనే చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత‌ చెప్పారు.

తారాగ‌ణం:
జ‌యం ర‌వి, అర‌వింద్ స్వామి, హ‌న్సికా మొత్వానీ, నాజ‌ర్‌, పొన్‌వ‌ణ్ణ‌న్‌, న‌రేన్‌, నాగేంద్ర‌ప్ర‌సాద్‌, వ‌రుణ్‌, అక్ష‌ర గౌడ‌

సాంకేతిక బృందం:
సంభాష‌ణ‌లు:  రాజేష్ ఎ. మూర్తి
సాహిత్యం:  భువ‌న‌చంద్ర‌
గాయ‌నీ గాయ‌కులు: స‌మీర భ‌ర‌ద్వాజ్‌, శ్రీ‌నివాస‌మూర్తి, సాయినాథ్‌, అశ్విన్‌, దీపిక‌
సంగీతం:  డి. ఇమ్మాన్‌
సినిమాటోగ్ర‌ఫీ:  సౌంద‌ర్ రాజ‌న్‌
కథ-  స్క్రీన్ ప్లే – ద‌ర్శ‌క‌త్వం: ల‌క్ష్మ‌ణ్‌
నిర్మాత‌:  రామ్ తాళ్లూరి
బ్యాన‌ర్‌: ఎస్‌.ఆర్‌.టి. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

Aravind Swamy and Jayam Ravi’s Bogan Telugu Trailer out now

After news broke out that Tollywood noted producer Ram Talluri is presenting the Bogan movie in Telugu version, the response received from the audience was overwhelming.

Bogan movie is being released in Telugu version with same title by noted Tollywood film producer Ram Talluri. Dubbing work for the movie has already been completed.

Bogan movie team has now released the trailer at 11 AM Today. Going by the trailer, one can understand that the movie is jam packed with breathtaking stunts and terrific action sequences. It is also to be noted that there are so many interesting twists and turns all through the movie.

In one of the scenes in the trailer, ‘Hansika’ is seen speaking to Aditya(aravind swamy) on phone asking him to come fast as Vikram(Jayam Ravi) is coming near to her with a revolver in his hand. And at the end of the trailer, Aravind Swamy is seen shouting Aditya but that character role is played by Aravind Swamy himself in the movie. Why is Hansika looking at Jayam Ravi with fear and why is Aravind Swamy calling out Aditya, to know that one has to watch the movie. There are so many suspense elements like these to watch out for in the movie.

The story revolves around a bank robbery case and police officer ‘Vikram’(Jayam Ravi) who wants to nab the criminal ‘Aditya’(Aravind Swamy) in the case.

Lakshman’s screenplay, D Imman’s music and Soundararajan’s cinematography are going to be the biggest highlights of the movie.

Jayam Ravi as IPS officer and Aravind Swamy as notorious thief are all set to give audience the feel of watching a Hollywood thriller movie with their top notch performance.

Jayam Ravi and Aravind Swamy teamed up once again for Bogan movie after Thani Oruvan movie. This movie which is made with a limited budget has collected approximately 25 crores and turned out to be sensational blockbuster in Tamil.

Hansika Motwani plays the female lead role in the movie, while Nasser, Ponvannan, Naren and Akshara Gowda play other supporting roles in the movie.

The producer of the movie Ram Talluri announced that they are planning to bring the movie as soon as possible for Telugu audience.

Technical team:

Dialogues: Rajesh A Murthy
Songs: Bhuvanachandra
Singers: Sameera Bharadwaj, Srinivas Murthy, SaiNath, Ashwin, Deepika
Music: D Imman
Cinematography: Soundararajan
Story-Screenplay-Direction: Lakshman
Producer: Ram Talluri
Banner: SRT Entertainments

Bogan_Plan-StillBogan_Trailer-out

‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖిలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌

3 రాజధానులు నమ్మకద్రోహమే

‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖిలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌
ఇది దుస్సంప్రదాయానికి దారి
అమరావతి ఆంధ్రులందరిదీ
ప్రజా ఉద్యమంగా మలచాల్సిన అవసరం ఉంది

3 రాజధానులు నమ్మకద్రోహమే

కాపులకు మేం రిజర్వేషన్లు ఇవ్వం, వర్గీకరణ మా చేతుల్లో లేదు.. అని ఎన్నికలకు ముందు జగన్‌ స్పష్టంగా చెప్పారు. ఇలా చాలా విషయాలపై స్పష్టంగా చెప్పిన మనిషి రాజధాని విషయంలో కూడా తన మనసులో మాట ఎన్నికలకు ముందే చెప్పి ఉంటే ప్రజలు అప్పుడే నిర్ణయించుకునేవారు.

ఈనాడు – అమరావతి, హైదరాబాద్‌

అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాలకే పరిమితం కాదని.. ఇది ఆంధ్రులందరి సమస్యని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉండాలని.. మూడు రాజధానులంటే నమ్మకద్రోహమేనని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర విభజన అనుభవాన్ని చూస్తున్నామని.. మళ్లీ మూడు రాజధానులంటే రాష్ట్రాన్ని  మూడు ముక్కలుగా విభజించటానికి పునాది వేసినట్లే తప్ప మరోటి కాదని అన్నారు. అమరావతిపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేసిన జనసేనాని.. రైతుల పోరాటం, వైకాపా యూటర్న్‌, దాని పర్యవసానాలపై ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో మాట్లాడారు.

?రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులపై హైకోర్టుకు జనసేన పరంగా ఏం చెప్పబోతున్నారు?
పవన్‌ కల్యాణ్‌: రాష్ట్ర రాజధాని విషయంలో మేం మొదటి నుంచీ స్పష్టమైన వైఖరితోనే ఉన్నాం. రాష్ట్ర విభజన గాయాల మధ్య పుట్టిన బాధ ఇది. ఒక ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినా.. ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు సరిగా స్పందించకపోవడంతో ఆ గాయాలు అలాగే ఉండిపోయాయి. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక, అంతా కలసి ఒక నిర్ణయం తీసుకున్నాక మళ్లీ దీన్ని మార్చటం భవిష్యత్తులో ప్రాంతాల మధ్య భేదాభిప్రాయాలకు పునాది అవుతుందనేది మా ఉద్దేశం.

?భాజపాతో మీకున్న మైత్రి నేపథ్యంలో రాజధానిని అమరావతిలోనే కొనసాగించేలా చూడాలని ఆ పార్టీని కోరతారా?
ముందు నుంచీ భాజపా జాతీయ నాయకత్వం నడ్డా గానీ మరెవరైనాగానీ- ఇన్నిచోట్ల రాజధానులుండటం మంచిది కాదనే చెబుతున్నారు. తమ దృష్టిలో అమరావతే రాజధాని అనీ.. మీరూ ఆ దృక్పథంతోనే ముందుకెళ్లండని వారు నాకు చెప్పారు. భాజపా అధినాయకత్వం వైఖరి అదే.
?కానీ రాజధానితో తమకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు చెబుతోంది కదా?
రాజకీయంగా కాకుండా రాజ్యాంగపరంగా చూస్తే- అమరావతిని రాజధానిగా నిర్ణయించుకున్నప్పుడు కూడా కేంద్రం జోక్యం చేసుకోలేదు. ఇప్పుడూ అదే చేస్తోంది. తమ పరిమితుల్లోకి రానిదానికి వాళ్లెలా బాధ్యత తీసుకుంటారు? భాజపాను, కేంద్ర ప్రభుత్వాన్ని విడివిడిగానే చూడాలి.
అమరావతి రైతుల పోరాటం విషయంలో మీ వైఖరి?
అమరావతి సమస్యను 29 గ్రామాలకే పరిమితం చేస్తున్నారు. నిజానికిది రాష్ట్రం మొత్తం బాధ. ఈ పోరాటం మరింత బలమైన ఉద్యమంగా రూపుదిద్దుకోవాలి. సమస్యను సమర్థంగా అందరిలోకీ తీసుకెళ్లటం లేదు. అమరావతిపై జరుగుతున్న వ్యతిరేక వాదనల్ని తిప్పికొట్టడం లేదు. బెంగాల్‌లో సింగూరు సమస్య దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందంటే కారణం.. దాన్ని సమర్థంగా అందరికీ అర్థమయ్యేలా చేశారు. అమరావతికీ అదే కార్యాచరణ ఉండాలి.

?ఇందుకు మీరు ప్రత్యక్ష పోరాటానికి  దిగుతారా?
ప్రత్యక్ష పోరాటానికి అభ్యంతరం లేదుగానీ..  ఇది ఒక్కరు చేసేది కాదు. నేనొక్కణ్నే భుజాలపై ఎత్తుకునేదీ కాదు. సమష్టిగా, ఉమ్మడిగా చేయాల్సిన పోరాటం. తెలంగాణ ఉద్యమం మాదిరిగా ఇదొక ప్రజా ఉద్యమం కావాలి. అమరావతి ఉద్యమం 29 గ్రామాల ప్రజలదో, ఒక కులానిదో, వర్గానిదో కాదని తెలియజెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరి మద్దతు కూడగట్టాలి. అమరావతిలో ఆడపడుచుల పోరాటం ఎంతో అద్భుతంగా ఉంది. వారి నాయకత్వంలోనే ఈ ఉద్యమం ముందుకు సాగితే బాగుంటుంది. కర్నూలులో సుగాలి ప్రీతి దుర్ఘటన 2017లో జరిగితే ఆమె తల్లి రెండేళ్లు ఎక్కని గడప లేదు.. తిరగని చోటు లేదు. ఆ తల్లి ఆవేదన మమ్మల్ని కలచివేసింది. అందర్నీ కదిలించి భుజం కాసేలా చేసింది.. ఒక తల్లి కదిలితేనే పోరాడాం. అలాంటిది ఇంతమంది తల్లులు కదిలితే ఎందుకు పోరాడం? కాకపోతే భాజపా, తెదేపా, వామపక్షాలు ఇలా అన్ని పార్టీలూ దీనికి కలసి రావాలి.

?అమరావతిని ఒక వర్గానికి లబ్ధి చేకూర్చే ప్రాజెక్టని వైకాపా విమర్శిస్తోంది.. దానిపై మీరేమంటారు?
ఇది దురదృష్టకరం. 2014లో వైకాపా అధికారంలోకి వచ్చి… దొనకొండలో రాజధాని పెట్టి ఉంటే అది ఒక సామాజికవర్గానికి చెందిన రాజధాని అని మరొకరు అనేవారు. ఇలాంటివి జరగకూడదంటే పాలకులకు విజ్ఞత ఉండాలి. ఒకసారి రాష్ట్ర విభజన అనుభవాన్ని చూస్తున్నాం. ఇప్పుడు కూడా మూడు రాజధానులనటం రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడానికి పునాది వేసినట్లే తప్ప మరోటి కాదు. రాష్ట్రానికి కేంద్ర బిందువు (రాజధాని) ఒక్కటే ఉండాలని మా పార్టీ మొదట్నుంచీ నమ్ముతోంది. అమరావతిని కేంద్ర బిందువుగా నిర్ణయించుకోవడం అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం. అందరికీ న్యాయం జరుగుతోందనే భావన కలిగించడంలో తెదేపా విఫలమవడం ఈ పరిస్థితికి కొంత కారణం. నేనైతే ఒక వర్గానికే లబ్ధి జరుగుతుందని నమ్మటం లేదు. ఎందుకంటే రాజధాని పెట్టాక ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెడతారు. అమరావతి ఏ ఒక్కరి సొత్తో కాదు. రాష్ట్ర ప్రజలందరిదీ! రాష్ట్ర విభజన అనంతరం క్షోభతో ఇక్కడ పెట్టుబడులు పెట్టినవారున్నారు.. నలుగురైదుగురు కలసి పెట్టుబడులు పెట్టిన ఇతర జిల్లాల వారున్నారు.

?అమరావతినే రాజధానిగా నమ్మి ప్రజలు పెట్టుబడులు పెట్టడానికి కారణాలేంటి?
అమరావతిని రాజధానిగా ప్రకటించిననాడు ప్రజాసంఘాలుగానీ, రాజకీయ పార్టీలు గానీ నిరసనగళమెత్తి ఉంటే ప్రజలు ఆలోచించుకునేవారేమో! రాష్ట్రంలో ఆనాడు ఎక్కడా అమరావతికి వ్యతిరేకత రాలేదు. ఇంత పెద్ద ఎత్తున భూమి అక్కర్లేదు.. కాస్త చిన్న రాజధాని చాలని జనసేన మొదటి నుంచి స్పష్టంగా చెబుతూనే ఉంది. వైకాపా నాయకత్వం మాత్రం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. జగన్‌ విపక్ష నేతగా ఉంటూనే అమరావతిలో ఇల్లు కట్టుకున్నారు. తానొచ్చినా ఇదే రాజధాని అని సంకేతాలిచ్చారు. ప్రతిపక్ష నాయకుడు కదిలినప్పుడు మీరెందుకు కదలరని నన్ను చాలామంది అడిగారు. దాంతో నేనూ అమరావతిలో ఇల్లు తీసుకున్నాను. చాలామందికి ఇలాగే అమరావతిపై నమ్మకం పెరిగి పెట్టుబడులు పెట్టారు. ఎక్కడెక్కడో ఉన్న ఆస్తులమ్మి ఇక్కడ కొనుక్కున్నారు. అమరావతితో అందరికీ అదో ఉద్వేగబంధం! కాబట్టి అమరావతి రాష్ట్ర రాజధాని అనే సమష్టి నిర్ణయంలో వైకాపా కూడా భాగస్వామే. అందుకు కట్టుబడి ఉండాల్సిందే.

?అధికార వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని ప్రభుత్వం చెబుతోంది?
నిజంగా అధికార వికేంద్రీకరణ జరగాలంటే పంచాయతీలకు అధికారాలు, నిధులు ఇవ్వాలి. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో అధికార వికేంద్రీకరణను వైకాపా ఇప్పటికే చేసేసిందని నా అభిప్రాయం. మళ్లీ అధికార వికేంద్రీకరణ ఏంటి? దశాబ్దాల కిందటే అభివృద్ధి చెందిన విశాఖలో రాజధాని పెట్టి కొత్తగా ఏం అభివృద్ధి చేస్తారు? మహా అంటే మైలో, రెండు మైళ్లో పెంచుతారు. అంతకంటే కొత్తగా సాధించేదేమీ లేదు. అదేదో ఇచ్ఛాపురంలోనో, అరకులోనో, అనంతపురంలోనో రాజధాని పెడితే కాస్త అభివృద్ధి జరుగుతుంది. ఇన్ని రకాల రాజధానులెక్కడా ఉండవు. పోనీ 3 రాజధానులు చేస్తే ఎవరికి లాభమో ఎవరికీ తెలియదు.

?మూడు చోట్ల ఏర్పాటు చేస్తామనటంలో హేతుబద్ధత ఏంటి?
ఇందులో హేతుబద్ధతేమీ లేదు. ఇలాంటి రాజకీయ ఆధిపత్య ధోరణులు, పోకడలే రాష్ట్ర విభజనకు కారణమయ్యాయి. నేడు రాష్ట్ర భవిష్యత్‌లో జరగబోయే దుష్పరిణామాలకు అవే కారణమవుతాయి. ఈ ఆలోచన విధానాన్ని రాష్ట్ర రాజకీయ నాయకత్వం వదిలిపెట్టాలి. వ్యక్తిగత ఎజెండాలతో ముందుకెళితే అలాంటి పరిస్థితులే ఉత్పన్నమవుతాయి.

?అమరావతినీ అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం అంటోంది కదా?
అమరావతి నుంచి అన్నీ తరలించాక ఇంకా అక్కడుండే అభివృద్ధి ఏంటో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. అలా కాకుండా అభివృద్ధి చేస్తామంటూ గాలిమాటలు మాట్లాడితే లాభం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఈ దుస్థితికి రావటానికి కారణం రాజకీయ నాయకత్వమే. కాపులకు మేం రిజర్వేషన్లు ఇవ్వం, వర్గీకరణ మా చేతుల్లో లేదు.. అని ఎన్నికలకు ముందు జగన్‌ స్పష్టంగా చెప్పారు. ఇలా చాలా విషయాలపై స్పష్టంగా చెప్పిన మనిషి రాజధాని విషయంలో కూడా మనసులో మాట ఎన్నికలకు ముందే చెప్పి ఉంటే ప్రజలు అప్పుడే నిర్ణయించుకునేవారు. ప్రతిపక్ష నేత హోదాలో అమరావతిని రాజధానిగా అసెంబ్లీలో అంగీకరించిన జగన్‌ ఇప్పుడు ప్రజల మనోభావాలు, వారి ఆస్తిపాస్తులతో రాజకీయ చదరంగం ఆడతానంటే ఎలా?  ఏదైనా సమస్య వస్తే పరిష్కరించమని.. కష్టం వస్తే కాపాడమని ప్రజలు ప్రభుత్వం దగ్గరకు వెళతారు. కాపాడాల్సిన ప్రభుత్వమే మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఎవరి దగ్గరికెళ్లాలి. అలాంటప్పుడు ప్రజలు కచ్చితంగా రోడ్లపైకి వస్తారు. ఇవాళ అమరావతి రైతుకు జరిగిన నష్టం రేపు మరో రైతుకు కలగదని నమ్మకమేంటి? అమరావతిలో జరిగింది ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జరిగిన ఒప్పందం. రైతులు నమ్మి ఇచ్చింది ప్రభుత్వానికే తప్ప తెదేపాకో, వైకాపాకో కాదు. అమరావతి విషయంలో జరిగిన ఈ నమ్మకద్రోహంపై ప్రజలంతా ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఆచరణలోకి వస్తే ప్రభుత్వాలకు దుష్టసంప్రదాయంగా మారుతుంది. దీన్ని ఆపటానికి ప్రజలంతా ఏకమవ్వాలి.


రాజధానిని మార్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉండదా?

గత ప్రభుత్వ విధానాల్లో, పథకాల్లో, నిర్ణయాల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకొని పోవాలి, అవకతవకలుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అంతేతప్ప ప్రభుత్వాలు మారినప్పుడల్లా అన్నీ మారుస్తూ పోతే ప్రజాస్వామ్యం అవుతుందా? భూస్వామ్య వ్యవస్థలో ఇది కుదురుతుందేమోగానీ ప్రజాస్వామ్యంలో కుదరదు. రాజధాని అమరావతి అని అంతా కలసి నిర్ణయం తీసుకున్నాక అక్కడే కొనసాగించాలి. లేదంటే ప్రజాధనం దుర్వినియోగమవుతుంది.


రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో అమరావతి పట్ల స్పందన ఎలా ఉంది?

ఉత్తరాంధ్రలో ప్రజల సమస్య అందరి సమస్య కాకుండా పోతుందా? ఉద్ధానంలో కిడ్నీల సమస్య మనకేంటని ఎవరైనా ఎలా ఉండగలుగుతాం? కానీ దురదృష్టవశాత్తు అమరావతి పట్ల అలాంటి మానవత్వపు స్పందనే ప్రజల్లో కరవైందనిపిస్తోంది. ఇది కులాల తాలూకు గొడవల ప్రభావమే. నాకు తెలిసినంత వరకూ అన్ని ప్రాంతాల ప్రజల్లోనూ అమరావతిపట్ల స్పందన,  ఆ రైతుల పట్ల సానుభూతి ఉంది. కానీ బహిరంగంగా స్పందించటం లేదు. రాజధానిపై గొడవ మొదలైనప్పుడు అన్ని జిల్లాల నుంచి జనసేన నాయకత్వాన్ని పిలిచాం. క్షేత్రస్థాయిలో ప్రజలు, పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నారో తెలుసుకొని రమ్మన్నాం. విస్తృతస్థాయి సమావేశంలో చర్చించాక మా పార్టీలో అంతా.. రాజధానిగా అమరావతే ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. పదేపదే మార్చటం మంచిది కాదన్నారు. రాష్ట్ర ప్రజలు చాలామందిలో అమరావతి రాజధానిగా ఉండాలనే ఉంది. కానీ రాజధానిని వాణిజ్యనమూనాగా చిత్రీకరించారు. అందుకే మిగిలిన ప్రాంతాలవారు దాన్నుంచి దూరమయ్యారనిపిస్తోంది. దీన్ని ఛేదించి ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి. ఇది నేను తెలంగాణ ఉద్యమాన్ని చూసి నేర్చుకున్నా!


అమరావతిలో ఇల్లు కట్టుకోవటం ద్వారా జగన్‌రెడ్డి ఇదే రాజధాని అని అందరికీ సంకేతం పంపించారు. దాంతో చాలామంది పెట్టుబడులు పెట్టారు. కాబట్టి అమరావతి రాష్ట్ర రాజధాని అనే సమష్టి నిర్ణయంలో వైకాపా కూడా భాగస్వామే. అందుకు కట్టుబడి ఉండాలి.


రైతులు నమ్మి భూములిచ్చింది ప్రభుత్వానికే తప్ప తెదేపాకో, వైకాపాకో కాదు.    ప్రభుత్వాన్ని పాలించేవారు మారొచ్చు. కానీ విధానం మారితే ఎలా? అమరావతిపై యూటర్న్‌ తీసుకున్నారు. అది అక్కడికే పరిమితం కాదు. ఆ యూటర్న్‌ ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్లకో.. భోగాపురం భూములకో.. మీ సంక్షేమ పథకాలకో వర్తించొచ్చు. కాబట్టి అమరావతిని కొంతమంది రైతుల సమస్యగా కాకుండా రాష్ట్రంలోని ప్రజలు, ప్రభుత్వానికి మధ్య నమ్మకం, ద్రోహం కోణంలో చూడాలి.


రాజకీయంగా ప్రజల్లో విభజన వచ్చేసింది. ప్రజలందరికీ సరైన ఉపాధి కల్పించకుంటే భవిష్యత్తులో రాష్ట్రంలో కుల, ప్రాంతీయ పోరాటాలు జరిగేలా వాతావరణం ఉందని భయమేస్తోంది. అది జరిగినప్పుడు.. ఆర్థిక, సామాజిక భద్రత ఉండదు. సిద్ధాంతపరంగా రాజకీయం చేయాలే తప్ప సామాజిక వర్గాలను అడ్డగోలుగా వ్యతిరేకించటం అవివేకం. వ్యక్తుల తప్పులను కులాలకు అంటగట్టడం సరికాదు. ఆంధప్రదేశ్‌ కులాల నుంచి బయటపడటానికి ఇదే సరైన సమయం.


 

జనసేన భవిష్యత్‌ ప్రణాళికేంటి?

3 రాజధానులు నమ్మకద్రోహమే

 

జనసేన ఆరంభించినప్పుడు మా పరిమితులు బాగా తెలుసు. నేను పెద్ద కలలేమీ కనలేదు. వాస్తవంలో బతికేవాళ్లం. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ప్రజాప్రయోజనాల కోసం పెట్టిన పార్టీ మాది. పార్టీని వాపులా చూపొచ్చు. కానీ అది బలం కాదు.  మేం ఓడినా భావజాలానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి బలంగా ఉన్నాం. కర్నూలులో సుగాలి ప్రీతి కేసులో మావాళ్లు బలమైన నేతల్ని ఎదుర్కొని బాధితుల తరఫున నిలబడ్డారు. కొవిడ్‌ సమయంలో కూడా మా కార్యకర్తలు ప్రజలకు సాయం చేశారు. చేస్తున్నారు. ఓట్లు పడతాయా లేదా అని కాకుండా ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అని ఆలోచిస్తున్నారు. ఇలా మా స్థాయి, బలంతో ముందుకెళుతున్నాం. ఎవరి మెప్పు పొందాలనో, ఎవరికో నిరూపించుకోవాలనో పనిచేయట్లేదు. ప్రవాహంలో కొట్టుకుపోయేవారు కాకుండా కొత్త ప్రవాహాన్ని సృష్టించే శక్తి మా జనసైనికులకుంది.

 

d472d6ae_01-crop--b28b6b 411650eb_02-crop--16e5a6

Jayam Ravi and ‘Arvind Swamy’ starrer super hit movie ‘Bogan’ is all set to release in Telugu soon.

 తెలుగులో త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ‘జ‌యం’ ర‌వి, ‘అర‌వింద్‌స్వామి’ ల సూప‌ర్‌హిట్ సినిమా ‘బోగ‌న్‌’


*ఈ నెల 26 న ట్రైలర్ విడుదల 

త‌మిళంలో అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రిగా రాణిస్తున్న ‘జ‌యం’ ర‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌కూ సుప‌రిచితుడే. తెలుగులో ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు నిర్మించిన సుప్రసిద్ధ సినీ నిర్మాత ఎడిట‌ర్ మోహ‌న్ కుమారుడైన ‘జ‌యం’ ర‌వి న‌టించిన త‌మిళ హిట్ సినిమాలు తెలుగులో అనువాద‌మై మంచి విజ‌యం సాధించాయి. అలాగే ఆయ‌న త‌మిళంలో చేసిన కొన్ని సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యి ఘ‌న విజ‌యం సాధించాయి.

ఉదాహ‌ర‌ణ‌కు అర‌వింద్‌స్వామి కాంబినేష‌న్‌తో ‘జ‌యం’ ర‌వి న‌టించిన‌ ‘త‌ని ఒరువ‌న్’ (2015) సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘ‌న విజ‌యం సాధించింది. ఆ సినిమాని తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్‌చచ‌ణ్ హీరోగా ‘ధృవ’ పేరుతో రీమేక్ చేయ‌గా, ఇక్క‌డా సూప‌ర్ హిట్ట‌యింది. ‘త‌ని ఒరువ‌న్’ త‌ర్వాత ‘జ‌యం’ ర‌వి, అర‌వింద్ స్వామి కాంబినేష‌న్‌లో రూపొంది సూప‌ర్‌హిట్ట‌యిన మ‌రో సినిమానే  ఈ  ‘బోగ‌న్‌’. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీని ల‌క్ష్మ‌ణ్ డైరెక్ట్ చేశారు. త‌క్కువ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా త‌మిళంలో రూ. 25 కోట్ల‌కు పైగా వ‌సూలు చేయ‌డం విశేషం.

ఇప్పుడు ‘బోగ‌న్’ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్‌తో ఎస్.ఆర్‌.టి. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి అందిస్తున్నారు. ఇప్ప‌టికే అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఎక్క‌డా అనువాద చిత్ర‌మ‌నే అభిప్రాయం క‌ల‌గ‌కుండా క్వాలిటీతో డ‌బ్ చేశామ‌ని నిర్మాత రామ్ తాళ్లూరి తెలిపారు. వ‌చ్చే వారం ట్రైల‌ర్‌, పాట‌ల‌ను విడుద‌ల చేస్తామ‌న్నారు.

ఒక బ్యాంక్ దొంగ‌త‌నం కేసును ద‌ర్యాప్తు చేస్తూ, ఆదిత్య అనే నిందితుడిని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే విక్ర‌మ్ అనే పోలీసాఫీస‌ర్ క‌థ ‘బోగ‌న్’ చిత్రం. త‌న‌కు చిక్క‌కుండా త‌ప్పించుకుంటున్న ఆదిత్య‌ను ఒక అద్భుత ప్లాన్‌తో విక్ర‌మ్ ప‌ట్టుకోవ‌డం టెర్రిఫిక్ ఇంట‌ర్వెల్ బ్లాక్‌. ఆ త‌ర్వాత క‌థ ప్రేక్ష‌కులు ఊహించ‌ని మ‌లుపులు తిరిగి, అనుక్ష‌ణం కుర్చీల‌లో మునివేళ్ల‌పై కూర్చోపెట్టేలా క‌థ‌నం ప‌రుగులు పెడుతుంది.

విక్ర‌మ్ ఐపీఎస్‌గా జ‌యం ర‌వి, ఆదిత్య‌గా అర‌వింద్ స్వామి ఫెంటాస్టిక్‌గా న‌టించిన ఈ సినిమా చూస్తుంటే ఒక హాలీవుడ్ థ్రిల్ల‌ర్ చూసిన ఫీలింగ్ క‌లుగుతుంద‌న‌డంలో అతిశ‌యోక్తి ఏమీ లేదు. హీరోయిన్‌గా హ‌న్సికా మొత్వాని న‌టించిన ఈ చిత్రంలో నాజ‌ర్‌, పొన్‌వ‌ణ్ణ‌న్‌, న‌రేన్‌, అక్ష‌ర గౌడ ఇత‌ర పాత్ర‌ధారులు. డి. ఇమ్మాన్ సంగీతం స‌మ‌కూర్చ‌గా, సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు.

*ఈ నెల 26 న చిత్రం ట్రైలర్ విడుదల అవుతుందని నిర్మాత తెలిపారు. త్వ‌ర‌లోనే చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని చెప్పారు.

తారాగ‌ణం:
జ‌యం ర‌వి, అర‌వింద్ స్వామి, హ‌న్సికా మొత్వానీ, నాజ‌ర్‌, పొన్‌వ‌ణ్ణ‌న్‌, న‌రేన్‌, అక్ష‌ర గౌడ‌

సాంకేతిక బృందం:
సంభాష‌ణ‌లు:  రాజేష్ ఎ. మూర్తి
సాహిత్యం:  భువ‌న‌చంద్ర‌
గాయ‌నీ గాయ‌కులు: స‌మీర భ‌ర‌ద్వాజ్‌, శ్రీ‌నివాస‌మూర్తి, సాయినాథ్‌, అశ్విన్‌, దీపిక‌
సంగీతం:  డి. ఇమ్మాన్‌
సినిమాటోగ్ర‌ఫీ:  సౌంద‌ర్ రాజ‌న్‌
ద‌ర్శ‌క‌త్వం: ల‌క్ష్మ‌ణ్‌
నిర్మాత‌:  రామ్ తాళ్లూరి
బ్యాన‌ర్‌: ఎస్‌.ఆర్‌.టి. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

Jayam Ravi and ‘Arvind Swamy’ starrer super hit movie ‘Bogan’ is all set to release in Telugu soon.

Jayam Ravi, who is one of the top lead actors in Tamil, is well known to the Telugu audience as well. He is the son of the renowned producer ‘Editor Mohan’, who has also produced many blockbuster movies in Telugu. Jayam Ravi’s Tamil blockbusters which were dubbed in Telugu have been successful and his other movies which were remade in Telugu
turned out to be blockbusters.

Jayam Ravi and Arvind Swamy starrer ‘Thani Oruvan’ (2015) was a huge success at the box office. The movie was remade in Telugu titled ‘Dhruva’ starring Mega Power Star Ram Charan and became a super hit.

‘Bogan’ is another super hit film from the hit combo of Jayam Ravi, and Arvind Swamy after ‘Thani Oruvan’. It is an action thriller directed by Lakshman. The movie was made under a meagre budget but it grossed more than 25 crore rupees at the Tamil box office.

Now ‘Bogan’ is being released in Telugu with the same title under SRT Entertainments banner and would be presented by the prominent  producer Ram Thalluri. Dubbing work has already been completed. Producer Ram Thalluri said that they have taken utmost care in dubbing work to ensure that it doesn’t give the impression of a dubbed movie. The trailer and songs will be released next week.

‘Bogan’ is the story of a police officer named Vikram who tries to catch the accused named Aditya while investigating a bank robbery case.  The way Vikram captures the ever escaping Aditya with his brilliant plan would be a terrific interval bang. After that, the story takes an unexpected turn and keeps the audience on the edge of their seats till the end.

Jayam Ravi as Vikram IPS and Arvind Swamy as Aditya have given a terrific performance. Hansika Motwani is the female lead. D. Imman composed music and Soundar Rajan handled the cinematography.

The producer said that preparations are being made to bring the movie to the Telugu audience soon. The trailer of this film will be released on September 26th.

Cast:
Jayam Ravi, Arvind Swamy, Hansika Motwani, Nazir, Ponvannin, Narain, Akshara Gowda

Technical team:
Conversations: Rajesh A. Murthy
Lyrics: Bhuvanachandra
Singers: Sameera Bharadwaj, Srinivasa Murthy, Sainath, Ashwin, Deepika
Music: d. Imman‌
Cinematography: Soundar Rajan
Direction: Lakshman
Producer: Ram Thalluri
Banner: S.R.T. Entertainments

Bogan-Movie-Poster-SRT02-1 Bogan-Movie-Poster-SRT.png-stilla-1