T.S.R. LALITAKALA PARISHAT

T Subbirami Reddy felicitates ‘Sye Raa’ Team, hails Chiranjeevi

* చిరంజీవి అంటే అందుకే నాకు అంత ఇష్టం

* ‘సైరా’తో భారతదేశానికి తన సత్తా ఏమిటో చిరంజీవి చాటి చెప్పారు.

* ‘సైరా’ ఆత్మీయ సత్కార సభలో కళాబంధు డా.టి.సుబ్బిరామిరెడ్డి, ఎం.పి (రాజ్యసభ)కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆరు దశాబ్దాల సినీ,వ్యాపార, రాజకీయ జీవితంలో సినీ కళాకారులతో ఎంతో సన్నిహితంగా ఉంటూ.. ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహిస్తూ ‘కళాబంధు’గా కీర్తించబడుతున్నారు. ఆయనే ప్రముఖ సినీ నిర్మాత,వ్యాపారవేత్త, రాజకీయవేత్త డా.టి. సుబ్బిరామిరెడ్డి. ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్‌ను సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. బుధవారం రాత్రి పార్క్ హయత్‌లో జరిగిన కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించిన సుబ్బిరామిరెడ్డి.. ‘సైరా’ బృందాన్ని సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ..‘‘150 చిత్రాలు చేసిన చిరంజీవికి అవన్నీ ఒక ఎత్తయితే 151వ సినిమా ‘సైరా’ మరో ఎత్తు. బ్రిటీషువారిని గడగడలాడించిన స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను తీసుకుని తన సత్తా ఏంటో భారతదేశానికి చిరంజీవి చాటిచెప్పారు. ఇలాంటి కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. చిరంజీవి అలాంటి సాహసం చేసి సక్సెస్ అయ్యారు. ఇలాంటి భారీ సినిమాను రామ్ చరణ్ లాంటి కుర్రాడు నిర్మించాడంటే ఆశ్చర్యం కలుగకమానదు. పిల్లలకు మనం నేర్పించాలి. కానీ రామ్ చరణ్ చిన్న వయసులోనే సింపుల్, హంబుల్, డౌన్ టుఎర్త్, అఫెక్షనేట్, ఫినామినల్ పర్సన్. అటువంటి రామ్ చరణ్ ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాడంటే అన్‌బిలీవబుల్. నేను దాదాపు 57 సంవత్సరాల నుంచి వ్యాపారాలు, రాజకీయాల్లో ఉన్నాను. కానీ, రామ్ చరణ్ లాంటి ధైర్యం చేయలేదు. దమ్మున్న, మనసున్న వ్యక్తి రామ్ చరణ్. నటుడిగా చేస్తూనే నిర్మాతగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. చరణ్ నుంచి ఈ మ్యాజిక్ అందరూ నేర్చుకోవాలి. చరణ్ పొగడ్తలు పట్టించుకోడు.
చిరంజీవితో నేను దాదాపు 20 సంవత్సరాల క్రితం స్టేట్‌రౌడి సినిమా నిర్మించాను. ఆ సినిమా హిందీలో డబ్ చేస్తే సూపర్‌హిట్ అయింది. ఆ సినిమా నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం ఉంది. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక ఢిల్లీలో ఇద్దరం ఎంపీలుగా ఉంటూ పక్కపక్కనే ఉండేవాళ్లం. ‘చిరంజీవి అంటే ప్రపంచం మర్చిపోతావేంటి?’ అని నా భార్య ఇందిర అంటూ ఉంటుంది. చిరంజీవి హృదయం, మనసు మంచివి అందుకే తను అంటే నాకు అంత ఇష్టం అని చెబుతుంటా. చిరంజీవి కోసమే ప్రత్యేకంగా ఈ మాల తయారు చేసి తెప్పించా.తమన్నా ఈ సినిమాలో ఎంతో చక్కగా నటించి మెప్పించింది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. తమన్నా నుంచి సురేందర్‌రెడ్డి అద్భుతమైన పనితనాన్ని రాబట్టుకున్నారు. నిజంగా సురేందర్‌రెడ్డిని మెచ్చుకోవాలి. తమన్నా ఈ ఫంక్షన్‌కు రావడం కోసం ఎంతో కష్టపడింది. చెన్నైలో ఉన్న ఆమె హుటాహుటిన ఈ కార్యక్రమం కోసమే హైదరాబాద్‌కు వచ్చింది. ఇప్పుడు మళ్లీ ముంబై వెళ్లి, అక్కడి నుంచి ఫారిన్ వెళ్తోంది. బిజీ షెడ్యూల్‌లో కూడా నేను పిలవగానే వచ్చిన తమన్నాను అభినందిస్తున్నా. ఈ సినిమా కోసం పరుచూరి బ్రదర్స్ చాలా కష్టపడ్డారు. ఇది అందరికీ తెలియజెప్పాల్సిన కథ అంటూ పదేళ్లపాటు చిరంజీవి కోసం ఎదురుచూశారు. వాళ్ల సహనానికి హ్యాట్సాఫ్. నేను నిర్మించిన ప్రతి సినిమాకూ వాళ్లే కథా రచయితలు. వాళ్లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కెమెరామెన్ రత్నవేలు తన ప్రతిభ ఏంటో మరోసారి ఈ సినిమాతో చాటి చెప్పారు. అలాగే రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్‌తో పాటు విజయ్ మాస్టర్ కూడా ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఆయనను కూడా అభినందిస్తున్నా. బుర్రాసాయిమాధవ్ తన డైలాగులతో ‘సైరా’ సినిమా స్థాయిని పెంచారు. ఇంకా ఇక్కడికి రాని చిత్రయూనిట్ అందరికీ నా ప్రశంసాభినందనలు తెలియజేస్తున్నా. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి. తెలుగు సినీ స్థాయి ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాలి.’’ అన్నారు.

పద్మభూషణ్ అవార్డు గ్రహీత, శాంత బయోటిక్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నేను సినిమా ప్రపంచానికి సంబంధించిన వ్యక్తిని కాదు కాబట్టి, నా మాట కొంత నిజాయితీగా ఉంటుంది. ‘సైరా’ చిత్ర కథాంశం చాలా పవిత్రమైనది. దేశభక్తికి సంబంధించినది. ఇవాళ అది కొడగట్టిపోతున్న తరుణంలో మళ్లీ తట్టిలేపడానికి ఈ చిత్రాన్ని నిర్మించాలనుకోవడం గొప్ప అంశం. సైరాకు కథనం, మదనం తయారు చేసిన పరుచూరి బ్రదర్స్‌కు జేజేలు. ఈ కథనాన్ని మంచి మాటల రూపంలో మలచిన సాయి మాధవ్ బుర్రాకు జేజేలు. ఇంత గొప్ప సృష్టిని వెండితెరపై ఆవిష్కరించిన సురేందర్‌రెడ్డికీ నా జేజేలు. ఇవన్నీ సమీకృతం చేసి, తానే దానికి ఆత్మ అయి, ఆయువుపట్టు అయి అద్భుతంగా దానికి ప్రాణ ప్రతిష్ట చేసిన నా ఆత్మీయుడు మెగాస్టార్ చిరంజీవికి పెద్ద జేజేలు. ఇంతమందిని సమాయత్తం చేసి వీళ్లందరికీ అవకాశం, ఒక వేదిక కల్పించి గొప్ప పని చేసిన రామ్ చరణ్ నా లెక్కలో ఇవాళ పెద్ద హీరో. అతను పూనుకోకపోతే ఇంత గొప్ప చిత్రం మనముందుకు వచ్చేది కాదు. హాట్సాఫ్ టు రామ్ చరణ్. ఇలాంటి గొప్ప మేనల్లుడిని పొందిన నా మిత్రుడు అరవింద్ కూడా గొప్పవాడు. థ్యాంక్యూ.’’ అన్నారు.

తమన్నా మాట్లాడుతూ..‘‘సుబ్బిరామిరెడ్డి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే.. మా డైరెక్టర్ సురేందర్‌రెడ్డి గారిని గెడ్డం లేకుండా క్లీన్ షేవ్‌లో చూసే అవకాశం కల్పించారు. ఇలా అందరినీ ఈ వేదికపై చూడడం ఎంతో ఆనందంగా ఉంది. మంచి సినిమాలకు సుబ్బిరామిరెడ్డి గారు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్‌గా ట్రీట్ చేస్తారు. ఈ రోజు నేను ఇక్కడ నిల్చున్నానంటే సుబ్బిరామిరెడ్డిగారే కారణం. నా బిజీ షెడ్యూల్‌లో కూడా ఇక్కడకు వచ్చేలా సపోర్ట్ చేసిన సుబ్బిరామిరెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో నటించే గొప్ప అదృష్టాన్ని కల్పించిన సురేందర్‌రెడ్డి, రామ్ చరణ్, చిరంజీవి గారికి చాలా పెద్ద థ్యాంక్స్.’’ అన్నారు.

పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..‘‘సైరా నరసింహారెడ్డి అనగానే సైరా అంది ఫస్ట్ చిరంజీవి గారు. నెక్ట్స్ సైరా అంది మా చరణ్ బాబు. సైరా నరసింహారెడ్డి అనే సినిమాను జనంలోకి తీసుకెళ్లగానే జనమంతా ‘సైరా’ అన్నారు. ఇలాంటి గొప్ప సినిమాను నిర్మించిన చరణ్ బాబుకు, మా ఎవర్‌గ్రీన్ హీరో చిరంజీవి, మా డైరెక్టర్ సురేందర్‌రెడ్డికి అభినందనలు. మంచి సినిమా ఎక్కడుంటే అక్కడ తాను ఉండి ప్రోత్సహించే సుబ్బరామిరెడ్డి గారికి కృతజ్ఞతలు.’’ అన్నారు.

డైరెక్టర్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘నేను ఏ ముహూర్తాన చరణ్‌తో ‘ధృవ’ సినిమా తీశానో కానీ, నన్ను ఒక మంచి సబ్జెక్ట్, టీమ్ మధ్య నిలబెట్టాడు. థ్యాంక్యూ చరణ్. నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం చిరంజీవిగారు ఇచ్చిన సపోర్ట్, ధైర్యమే. మెగాస్టార్ ప్రోత్సాహమే నన్ను ఇంతదూరం తీసుకొచ్చింది.’’ అన్నారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ..‘‘సుబ్బిరామిరెడ్డి గారి ఫంక్షన్ లేకపోతే ఆ సంవత్సరం మాకు ఏదో వెలితిగా ఉంటుంది. తమన్నా పక్కన మెరిసిపోతూ ఆయన డాషింగ్‌గా కనిపిస్తున్నారు. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ డాడీ. నేనేదో ఆయకు ప్రొడ్యూసర్ అని అందరూ అంటున్నారు. కానీ, నేను అలా భావించట్లేదు. ఆయన సినిమాలో నేను కూడా ఒక వర్కర్ అంతే. ఆయన చిటికేస్తే ఎంతోమంది ప్రొడ్యూసర్‌లు ముందుకొస్తారు. అందుకే నేను ప్రత్యేకంగా ఆ స్థాయిని తీసుకోదల్చుకోలేదు. ఆయన సంకల్పమే మమ్మల్నందరినీ కలిపి ఆయన కోసం, పైన ఉన్న నరసింహారెడ్డి కోసం పనిచేసి ఇంతపెద్ద సినిమా చేయగలిగే అవకాశం మాకు ఇచ్చారు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ థ్యాంక్యూ.’’ అన్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘‘ఎక్కడ మంచి సినిమా ఉన్నా దాన్ని తీసుకొచ్చి గౌరవించడం అన్నది సుబ్బిరామిరెడ్డిగారి గొప్పతనం. ఆంధ్రప్రదేశ్‌లో సినిమాను ప్రేమించే అందరి కడుపులు నిండడమే కాకుండా మా కుటుంబం కడుపులు చాలా నిండిపోయేటట్టుగా చేసిన సినిమా ‘సైరా’. అందుకు చిరంజీవిగారికి ధన్యవాదాలు. ఇటువంటి గొప్ప సినిమాను మా మేనల్లుడు తీశాడనే గొప్పతో పాటు చిన్న ఈర్ష్య కూడా ఉంది.’’ అన్నారు.

రత్నవేలు మాట్లాడుతూ..‘‘సైరా ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. చిరంజీవిగారు ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. థ్యాంక్యూ ’ అన్నారు.

బుర్రాసాయిమాధవ్ మాట్లాడుతూ..‘‘చిరంజీవి గారి అభిమాని నాకు కాల్ చేసి ‘సార్ మన అన్నయ్యకు చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇచ్చారు’ అన్నారు. అప్పుడు నేనొక్కమాట అన్నా.. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. చిరంజీవిగారు చేస్తే మామూలు సినిమా కూడా చరిత్రలో నిలిచిపోతుంది. అది చరిత్ర చెప్పిన సత్యం. మామూలు సినిమాలే  ఆయన చరిత్రలో నిలబెట్టారు. అలాంటిది చరిత్రలో నిలిచిపోయే లక్షణాలున్న సినిమా చిరంజీవి గారికి వస్తే ఎలా ఉంటుంది.. సైరాలా ఉంటుంది. నా జీవితం మొత్తం చెప్పుకొనే సినిమాకు నేను పనిచేశాను’’ అన్నారు.

బ్రహ్మాజీ మాట్లాడుతూ..‘‘ఇంత గొప్ప సినిమాలో నాకు ఒక పాత్ర లభించడానికి ముఖ్య కారణం ఎవరంటే మా చరణ్ బాబు. ‘రంగస్థలం’ షూటింగ్‌లో అన్నయ్య పక్కన ఒక్క సీన్ ఇవ్వు అంటూ రోజూ బతిమాలితే సురేందర్‌రెడ్డి గారిని కన్విన్స్ చేసి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్యూ సురేందర్‌రెడ్డి. ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన మా గ్లామర్ బాయ్ సుబ్బుకి థ్యాంక్యూ వెరీమచ్.’’ అన్నారు.

మురళీమోహన్ మాట్లాడుతూ..‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అంతర్జాతీయంగా పేరు తెచ్చిన గొప్ప సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. చాలా సంతోషంగా ఉంది. మన తెలుగు సినిమా ఇంటర్నేషనల్ సినిమా అయిందని నిరూపించిన నా తమ్ముడు చిరంజీవికి నా హృదయపూర్వక అభినందనలు. మున్ముందు మరిన్ని ఇలాంటి మంచి సినిమాలు తీసి తెలుగు ఇండస్ట్రీ లెవల్‌ను ప్రపంచ స్థాయికి తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.’’ అన్నారు.

రాజశేఖర్ మాట్లాడుతూ..‘‘చిరంజీవిగారి గురించి మాట్లాడే అదృష్టం నాకు కలిగింది. ఇంత పెద్ద సినిమా చేయాలంటే ఉండాల్సింది డబ్బులు కాదు.. గుండెల్లో ధైర్యం ఉండాలి. హ్యాట్సాఫ్ టు రామ్ చరణ్. చిరంజీవిగారు లేకుండా రామ్ చరణ్ లేరు. గొప్ప సినిమా తీసి తన తండ్రికి మంచి గిఫ్ట్ ఇచ్చాడు. తెలుగువాళ్లందరూ గర్వంగా ఫీలయ్యే సినిమాలో యాక్ట్ చేసిన చిరంజీవి గారికి హ్యాట్సాఫ్. ఇంత పెద్ద సినిమాను సురేందర్‌రెడ్డి చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆయన చాలా లక్కీ. చిరంజీవి గారూ.. నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి. డబ్బు సంపాదించడమే కాదు.. డబ్బు ఖర్చుపెట్టడం, ఇంత పెద్ద సినిమా చేయడం నిజంగా హ్యాట్సాఫ్ టు యు. అండ్ గ్రేట్. అందరూ ఈ వయసులో అని అంటున్నారు. సినిమా చూసినప్పుడు నాకు ఆయన వయసు కనిపించలేదు. ఆ స్పీడ్ అంతా ఎప్పటిలాగే అనిపించింది. తెలుగువారందరూ గర్వపడేలా చేసిన చిరంజీవిగారు నిజంగా గ్రేట్. ఇలాంటి కార్యక్రమం సుబ్బిరామిరెడ్డిగారు మాత్రమే ఏర్పాటు చేయగలరు. మంచి సినిమాలను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు’’ అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ…‘‘ఇంతకు ముందు సక్సెస్ మీట్‌లో చెప్పినట్లు చిరంజీవిగారికి ఇది కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్. 151 సినిమాల్లో ఎన్నో అద్భుతాలు చూశారు. ఎన్నో విజయాలు చూశారు. కానీ, ఇదొక మైల్‌స్టోన్ సినిమా.’’ అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..‘‘గత పదిహేను రోజుల నుంచి ‘సైరా’ విజయం గురించే మాట్లాడుతున్నా. ఇక్కడ చెప్పాల్సింది దాని గురించి కాదు. ఎక్కడ మంచి జరిగినా.. పది మంది సంతోషంగా ఉన్నా.. అందులో తానూ భాగం అవుతూ పదిమందికీ సంతోషాన్ని పంచే వ్యక్తి సుబ్బిరామిరెడ్డి. ఆయనను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఆయనకు కళాబంధు అని ఎవరు పెట్టారో తెలీదు కానీ, ఆయన మనసు నిజంగా అద్భుతం. ‘సైరా’ ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత ఆయన నాతో ఆనందం పంచుకున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తీస్తున్నామని తెలిసినప్పటి నుంచి ఆయన ఎంతో శ్రద్ధ చూపించారు. ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకునేవారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని ధీమాగా చెప్పేవారు. ఈ సినిమా హిట్ అయితే ఆయనే నిర్మాతగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయినంత ఆనందాన్ని మాతో పంచుకోవడం, మమల్ని అభినందించడం సంతోషంగా ఉంది. ఆయన కళాహృదయానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఆయన ప్రేమ, అభిమానంతో నా గుండె నిండిపోయింది. ‘సైరా’ను నా జీవితంలో గుర్తుండిపోయే సినిమాగా తెరకెక్కించిన సురేందర్‌రెడ్డికి ఎన్నిసార్లు అభినందనలు చెప్పినా తక్కువే. బుర్రా సాయిమాధవ్ నుంచి ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు చాలా థ్యాంక్స్. ఇంత గౌరవప్రదమైన సినిమాను నాకు గిఫ్ట్‌గా ఇచ్చిన రామ్ చరణ్ నా నిర్మాతలందరిలోనూ నెంబర్ వన్ ప్రొడ్యూసర్. నేటి తరం హీరోయిన్లకు తమన్నా ఆదర్శం. ఆమె డెడికేషన్ మాటల్లో చెప్పలేనిది.’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఈనాడు ఎం.డి.కిరణ్ దంపతులు,సినీ ప్రముఖులు విక్టరీ వెంకటేశ్, జీవిత రాజశేఖర్ దంపతులు, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, ఛార్మి, కేథరిన్, నిహారిక,  అశ్వినీదత్, బోనీకపూర్, సురేష్ బాబు, కె.ఎస్.రామారావు, డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, క్రిష్,సుకుమార్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, రాజకీయ నాయకులు రఘురామ కృష్ణంరాజు, మురళీమోహన్, కేవీపీ, పీవీపీ, సీఎం రమేష్, దానం నాగేందర్, జేసీ పవన్‌రెడ్డి, క్రీడారంగం నుంచి చాముండేశ్వరినాథ్, అజారుద్దీన్, కాసు ప్రసాదరెడ్డి  తదితరులు పాల్గొన్నారు. సన్‌షైన్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి చిరంజీవి మీద అభిమానంతో ‘సైరా’ ప్రత్యేక కేక్‌ను తయారు చేయించి మెగాస్టార్‌కు బహూకరించారు

PVP_3248 PVP_3251 PVP_3293 PVP_3302 PVP_3306 PVP_3313 PVP_3370 PVP_3412 PVP_3422 PVP_3461 PVP_3474 PVP_3476 PVP_3488 PVP_3501 PVP_3507 PVP_3525 PVP_3530 2 PVP_3530 PVP_3539 PVP_3563 PVP_3567 PVP_3586 PVP_3594 PVP_3607 PVP_3611 PVP_3653 PVP_3659 PVP_3667 PVP_3693 PVP_3699 PVP_3702 PVP_3709 PVP_3721 PVP_3730 PVP_3746 PVP_3751 PVP_3758 PVP_3762 PVP_3773 PVP_3775 PVP_3784 PVP_3794 PVP_3801 PVP_3809 PVP_3819 PVP_3833 PVP_3836 PVP_3842 PVP_3850 PVP_3856 PVP_3861 PVP_3863 PVP_3870 PVP_3877 PVP_3898 PVP_3914 PVP_3933 PVP_3941 PVP_3959 PVP_3962 PVP_3963 PVP_3971 PVP_3977 PVP_3978 PVP_3980 PVP_3982 PVP_3986 PVP_3994 PVP_4001 PVP_4002 PVP_4012 PVP_4018
T Subbirami Reddy felicitates ‘Sye Raa’ Team, hails ChiranjeeviT Subbirami Reddy is well known as ‘Kalabandhu’ for a reason. He takes pleasure in others’ successes and showers artistes with unconditional love. Time and again, this veteran politician, producer and philanthropist has proved his love for good cinema.

Delighted with the massive success of ‘Sye Raa Narasimha Reddy’, TSR felicitated the film’s team at an event held at Park Hyatt in Hyderabad on Wednesday. The event was attended by famous movie and political personalities.

Congratulating team ‘Sye Raa’, TSR said, “‘Compared to his previous 150 films, Chiranjeevi’s 151st film ‘Sye Raa’ is on another level. It’s a big milestone in his career. He has shown his stamina to the nation by portraying Uyyalawada Narasimha Reddy, who gave Britishers sleepless nights, excellently. He has taken a huge risk by selecting this story and has been successful. I couldn’t believe that a youngster like Ram Charan has produced this film. In my career spanning 57 years, I’ve never done such a huge risk. Charan is a very affectionate, down-to-earth and phenomenal person. What he has done for this movie is unbelievable. He is a brave producer and everyone should learn from him”.

“I’ve been travelling with Chiranjeevi for more than 20 years. I produced his ‘State Rowdy’ and when we dubbed it into Hindi, it became a super hit. We have been friends since then. I love him because he is very kind-hearted. Tamannaah did a fabulous job in this movie. Her expressions are excellent. She took time amidst busy schedule to attend this event. Director Surender Reddy should be appreciated for what he has done for this movie. Paruchuri Brothers worked very hard for this movie. They wanted everyone to know this story and waited for more than 10 years for their dream to be fulfilled. I congratulate them wholeheartedly. Burra Sai Madhav’s dialogues have taken the film to another level. Cameraman Rathnavelu has once again proved his talent.  I also congratulate fight masters Ram-Lakshman and Vijay Master for their work. I hope many more films like this will be made in the future and prove the standards of Telugu cinema to the world”

Shantha Biotechnics chairman, Padmabhushan K.I.Vara Prasad Reddy said, “My words will be genuine as I am not related to film industry. ‘Sye Raa’ story is very sacred. It’s a patriotic film and films like this are the need of the hour as the today’s generation lacks the sense of patriotism. Hats-off to Megastar Chiranjeevi for breathing life to the character of Uyyalawada Narasimha Reddy, Paruchuri Brothers for for their effort to tell this great story to the world, Burra Sai Madhav for his amazing dialogues. Ram Charan is the real hero for making this dream come true. My friend ALlu Aravind is fortunate to have a nephew like Charan”. \

Tamannaah said, “Big thanks to Subbirami Reddy garu. Only because of him, this event has been possible. He always supports good movies and treats me like a family member. I couldn’t enjoy the success of this movie because of my busy schedule. But he has made me to come to this event and revel in these moments. I thank Surender Reddy garu, Chiranjeevi garu and Ram Charan for giving me this wonderful opportunity to act in this movie”.

Paruchuri Venkateswara Rao said, “It was Chiranjeevi who first said sye raa when we approached him and then it was Ram Charan. Now audience are saying sye raa. I thank Chiranjeevi garu, Ram Charan and Surender Reddy garu for making this film possible. I also thank Subbirami Reddy garu for encouraging good films”.

Surender Reddy said, “I thank Ram Charan for giving me this opportunity to direct this great film. It happened because of ‘Dhruva’. I’m here today only because of the great support of Chiranjeevi garu”.

Ram Charan said, “We can’t imagine a year without TSR garu’s event. He looks dashing beside Tamannaah today.  I thank my dad for giving me this opportunity to produce this movie. I don’t feel like a producer for him. I’m just a worker for his movie. I don’t like to take the position of a producer because if he wants, many would have come forward to produce this movie. It was only his strong determination that brought us together to make this movie for not only him but also for Uyyalawada Narasimha Reddy. I thank everyone who are here”.

Allu Aravind said, “Whenever Subbirami Reddy garu finds a film good, he makes sure to honour the team. It’s his greatness. ‘Sye Raa’ has been like a grand feast for not only Telugu cinema lovers but also our family. I thank Chiranjeevi garu for that. I feel proud and also jealous of Ram Charan”.

Rathnavelu said, “‘Sye Raa is the pride of India. Chiranjeevi garu is the pride of Indian cinema. Thank you”.

Sai Madhav Burra said, “A fan of Chiranjeevi garu called me and said that we have given a film that will remain in the history for the Megastar. I said that he was wrong because even a normal movie will remain in the history if Chiranjeevi garu does it. It’s a fact. Many normal movies created history only because of him. What happens if a great subject comes to Chiranjeevi garu ? It’s what happened now. Working for this movie will be a life long memory for me”.

Brahmaji said, “When I was doing ‘Rangasthalam’, I requested Ram Charan to give me a small role in Annayya’s film. After repeated requests, he convinced Surender Reddy garu and gave me the opportunity to act in this movie. Thank you Surender Reddy garu. I thank ever glamorous Subbu garu for organizing this event”.

Murali Mohan said, “I am very happy that my brother Chiranjeevi acted in this film, which proved Telugu Cinema’s potential globally. I hope he does many more great films like ‘Sye Raa’”.

Rajasekhar said, ” I’m very fortunate to have got this chance to talk about Chiranjeevi garu. Hats-off to Ram Charan for producing this movie. More than money, one should have a lot of courage to produce films like this. Charan has given a great gift to his dad. Hats-off to Chiranjeevi garu for making Telugus proud with this movie. He has spent a lot of money for doing this movie. Surender Reddy has handled this movie very well. He is very lucky. Everyone is saying that he has done such a film at this age. But I couldn’t see his age when I was watching ‘Sye Raa’. He was as speed as ever. I once again thank the team for making this movie and TSR garu for this event”.

Dil Raju said, “As I said before, this is the best film in Chiranjeevi garu’s career. He has seen many successes in his career. But this is a milestone film for him”.

Chiranjeevi said, “I’ve been talking about ‘Sye Raa’ success for the last 15 days. Now I want to talk Subbirami Reddy garu. He is someone who takes pleasure in others’ successes and always tries to make others happy. ‘Kalabandhu’ title is very apt for him. He has been supporting us since the day we started making this movie and used to tell that this movie will be a huge hit. I thank him for his unconditional love. I can’t thank Surender Reddy enough for making a memorable film like ‘Sye Raa’ with me. I thank every artist and technician who worked for this movie. Ram Charan is the best producer I’ve worked with so far”.

Eenadu Md Kiran,Sailaja kiran Victory Venkatesh, Jeevitha, Rajasekhar, Varun Tej, Allu Sirish, Charmme, Catherine, Niharika, Ashwini Dutt, Boney Kapoor, Suresh Babu,k.s.Ramarao, Kodandarami Reddy, Krish, Sukumar, Meher Ramesh, Anil Ravipudi, Raghurama Krishnam Raju, KVP, PVP, CM Ramesh, Danam Nagendar, JC Pavan Reddy, Chamundeswarinath, Azharuddin, Kasu Prasadareddy, were among others who attended the event.

Sunshine Hospitals Chairman Guruvareddy presented a special cake for Megastar Chiranjeevi

మహానటి’ ఏ ఒక్కరో కాదు.. అందరూ మహానటిలే: జయసుధ

890 (1) 890 (2) 890 (3)

 మహానటి’ ఏ ఒక్కరో కాదు.. అందరూ మహానటిలే: జయసుధ

ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనీ, వారిలో ఒకరు మోహన్‌బాబు అయితే, మరొకరు మురళీమోహన్ అనీ సహజనటిగా పేరుపొందిన జయసుధ వ్యాఖ్యానించారు. అంతే కాదు.. మనం ‘మహానటి’ అనే మాటను ఒకరికే ఉపయోగిస్తుంటామనీ, కానీ అందరూ మహానటిలేననీ ఆమె అన్నారు. జయసుధకు ‘అభినయ మయూరి’ అనే ఆవార్డును ఇవ్వనున్నట్లు కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ఆ అవార్డును ప్రదానం చేయనున్నారు. దీనికి సంబంధించి మంగళవారం హైదరాబాద్‌లో ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో జయసుధ మాట్లాడారు.

“ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఒకరు మోహన్‌బాబు గారైతే, మరొకరు మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారితో హీరోయిన్‌గా ఎక్కువ సినిమాల్లో నటించాను. వాటిలో ఎన్నో సక్సెస్ అయ్యాయి. మహానటి అంటే మనం ఒక్కరే అనుకుంటాం. అందరూ మహానటిలే. మహనటి అయితే తప్ప ఇండస్ట్రీలో సస్టైన్ అవలేం. జమున గారి నుంచి డిసిప్లిన్ నేర్చుకున్నా. ఆమెకంటూ కొన్ని ప్రిన్సిపుల్స్ ఉన్నాయి. వాటిని శాక్రిఫైస్ చెయ్యకుండా సక్సెసయ్యారు. మురళీమోహన్ గారు ఎవర్‌గ్రీన్ హీరో. ఆయన (జుట్టుకి) కలర్ వేసుకున్నా, వేసుకోకపోయినా యువకుడిలాగే కనిపిస్తారు. మా ఇంట్లో జీన్స్ ప్రకారం నా జుట్టు ఊడిపోతోంది. అవార్డులు రాకపోయినా ఫర్వాలేదని అంటుంటాం కానీ, అవార్డులు వస్తే మనసులో సంతోషంగా అనిపిస్తుంది. అవార్డు అనేది మనం చేసిన పనికి గుర్తింపు. కొన్ని అవార్డులు  ఇస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఉదాహరణకు నంది అవార్డులు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వాటిని పక్కన పెట్టేశాయి. తమిళనాడు ప్రభుత్వం సినిమా ప్రముఖులకు కలైమామణి అవార్డు ఇస్తూ వస్తోంది. వాళ్లు దాన్ని బాగా చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వాటిని ఏ పేరుతో ఇస్తారో.. ఇవ్వాలి. వాళ్లే మమ్మల్ని గుర్తించకపోతే ఎలా? మేం చాలా కార్యక్రమాలకు వస్తుంటాం. సోషల్ వర్క్‌కు రావాలంటే వస్తాం. అలాంటి మమ్మల్ని గుర్తించి అవార్డులిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దానివల్ల నవ తరానికి కూడా అవార్డు విలువ తెలుస్తుంది. ఎవరిచ్చినా, ఇవ్వకపోయినా సుబ్బరామిరెడ్డి గారు ఆయన బర్త్‌డేకి అవార్డులు ఇస్తుంటారు. 20 ఏళ్ల నుంచీ నిర్విరామంగా ఆయన అవార్డులు ఇస్తుండటం చాలా గొప్ప విషయం” అని ఆమె అన్నారు.

అంతకు ముందు కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ “ఇరవై ఏళ్ల నుంచీ సెప్టెంబర్ 16, 17 తేదీల్లో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నా. సినీ రంగానికి చెందిన ఎంతోమంది గొప్పవాళ్లకు అవార్డులు ఇస్తూ వస్తున్నా. ఇప్పుడు జయసుధకు ‘అభినయ మయూరి’ అనే అవార్డును ఇవ్వబోతున్నా. ఆమె అద్భుత నటి. మనం గర్వించే నటి. ఆమెది 46 ఏళ్ల కెరీర్. సెప్టెంబర్ 17న విశాఖపట్నంలోని కళావాహిని ఆడిటోరియంలో ఆమెకు అవార్డును ప్రదానం చేస్తాం. దానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వస్తున్నారు. కొంతమంది సినిమా కళను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. కానీ ఎన్నో శాఖల్ని ఇముడ్చుకున్న సినిమా దేవుని సృష్టిలో చాలా గొప్ప కళ. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి మహానటులు ఏ అవార్డు ప్రకటించినా వచ్చి తీసుకునేవాళ్లు. ఇప్పటి హీరోలు వాళ్లను ఫాలో కావడం లేదు” అన్నారు.

సీనియర్ నటుడు మురళీమొహన్ మాట్లాడుతూ “జయసుధ అదివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ‘జ్యోతి’ సినిమా మరో ఎత్తు. ఆ సినిమాతో ఆమె నటిగా విపరీతమైన పేరు తెచ్చుకుంది. ఇద్దరం చాలా సినిమాల్లో కలిసి నటించాం. తను స్నేహానికి చాలా విలువిచ్చే నటి. సుబ్బరామిరెడ్డిగారు ఆమెకు ‘అభినయ మయూరి’ అనే అవార్డుతో సత్కరించనుండటం ఆనందంగా ఉంది. ఏదో ఒకరోజు నాకు కూడా ఆయన ఏదో ఒక అవార్డును ఇస్తారని ఆశిస్తున్నా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా అవార్డుల్ని పట్టించుకోవట్లేదు. నంది అవార్డు వచ్చిందంటే గొప్పగా చెప్పుకుంటారు. దయచేసి ఇప్పటి ప్రభుత్వం ఆ అవార్డుల్ని ఇవ్వాల్ని కోరుతున్నా. నాలుగేళ్ల నుంచీ ఆ అవార్డులు పెండింగులో ఉన్నాయి” అని చెప్పారు.

ఒకప్పటి అందాల నటి జమున మాట్లాడుతూ “జయసుధ ‘పండంటి కాపురం’లో నా కూతురిగా నటించింది. చాలా చక్కని నటి. ఆమెకు సుబ్బరామిరెడ్డిగారు అవార్డు ప్రకటించడం ఆనందంగా ఉంది. ఆమె మాతో సమానమైన మహానటి అని చెప్పొచ్చు. గొప్ప గొప్ప పాత్రలు చేసింది. కళల పట్ల, సినీ రంగం పట్ల సుబ్బరామిరెడ్డి గారికున్న అభిమానం చాలా గొప్పది. విశాఖపట్నంలో ఆయన చేసే సేవా కార్యక్రమాలు అపూర్వం” అన్నారు.

Jayasudha entitled abhinaya Mayuri by ‘TSR Lalithakalaparishath’

Senior actress Jayasudha is set to be entitled AbinayaMayuri by

 TSR LalithakalaparishathSubbarami Reddy said that the honors will be done on his birthday which happens to be on September 17th.

 On the occasion of my birthday TSR Lalithakala Parishath is organizing grand spiritual and cultural events on 16th and 17th September, 2019 at Visakhapatnam.  On 16th September I am felicitating Spiritual Personalities and Chief Priests of Indian Temples from Kashmir to Kanyakumari & Kashi (Varanasi) to Rameshwaram at VUDA Children Theatre, Siripuram, Visakhapatnam. On 17th September “Sarvadharma Samabhavana Sammelan” and spiritual leaders of Hindu, Islam, Christian, and Sikh religions will be honoured at Kalavani Auditorium, Visakhapatnam at 5.00 pm.

Every year I am honouring prominent dignitaries in the field of film and fine arts.  Till now popular personalities like Bharath Ratna Pandit Ravishankar, Asha Bhosle, Shivaji Ganeshan, Akkineni Nageswar Rao, Dr.C.Narayana Reddy, Mangalampalli Balamurali Krishna, Jesudas, P.Suseela, S.Janaki, M.Mohan Babu, Jamuna and number of other Artistes were honoured.

This year we are celebrating 46 years of film career of Sahajanati Smt.Jayasudha and presenting her a title “ABHINAYA MAYURI”.  Smt.Jayasudha made her acting debut at the age of 14 years.  She acted in more than 300 films in the languages like Telugu, Kannada, Tamil and Hindi and completed 46 years of her film career.

Senior Film Artistes like Jamuna,  Mohan Babu, Vanisree, Sarada, Jayaprada,  Suhasini, Radhika, Krishnam Raju Roja, Brahmanandam Sarath Kumar, V.K.Naresh and number of Hon’ble Ministers of A.P. and Parliament Members will also grace the occasion. The programme will be held on 17th September at Kalavani Auditorium, Visakhapatnam at 5.00 pm.

Jayasudha thanked the jury for the special appreciation. The senior actress said she feels honored to receive this title.

Muralimohan said that Jayasudha is a very fine actress and fully deserves the acclaimed title. He said that he shares a good boding with Jayasudha as they have worked together for many movies in the past.

Jamuna said that it is really good to see Subbarami Reddy encouraging senior actors every years by holding such awards event. She further added that Jayasudha is the right person to bag this title this year.

ప్రముఖ నటి బి.సరోజాదేవి కి టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు ప్రదానం


BVN_6147 BVN_6193 BVN_6275 (1) BVN_6275 BVN_6294 BVN_6323 BVN_6329 BVN_6467 BVN_6516 (1) BVN_6647 BVN_6655 BVN_6666 BVN_6688 BVN_6698 BVN_6700 BVN_6701

‘‘నేనెక్కడ కనిపించినా తెలుగు ప్రేక్షకులు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే…’ 

పాటని గుర్తు చేస్తుంటారు. ‘కృష్ణార్జునయుద్ధం’లో నేను ఎన్టీఆర్‌ని చిన్నన్నయ్యా అంటుంటాను. ఆ సంభాషణని గుర్తు చేసి ఒకసారి చెప్పండని అడుగుతుంటారు. మరోసారి ఈ వేదికపై ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంద’’న్నారు ప్రముఖ నటి బి.సరోజాదేవి. ఆమెకి టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి విశాఖపట్నంలో ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదుని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘టి.సుబ్బరామిరెడ్డికి కళలన్నా, కళాకారులన్నా ఎంతో గౌరవం. శివరాత్రి రోజున ఈ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంద’’న్నారు.‘‘ఆ రోజుల్లో హీరోల్ని మించి పారితోషికం అందుకొన్న కథానాయిక బి.సరోజాదేవి. ఆమెకి తెలుగు ప్రజల తరఫున ప్రదానం చేసిన బిరుదు… ‘విశ్వనట సామ్రాజ్ఞి’’ అన్నారు టి.సుబ్బరామిరెడ్డి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ద్రోణంరాజు శ్రీనివాస్‌, పడాల అరుణ, నటుడు, ఎంపీ మురళీమోహన్‌ నటీమణులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, గాయని పి.సుశీల తదితరులు పాల్గొన్నారు.  

  శివనామ స్మరణతో సోమవారం విశాఖ సాగరతీరం మార్మోగింది. సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఏటా సాగరతీరంలో నిర్వహించే మహా కుంభాభిషేకం ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు సాగరతీరానికి తరలివచ్చారు. దీంతో తీరం వెంబడి భక్తుల శివనామ స్మరణతో మార్మోగింది. కోటి లింగాలకు కుంభాభిషేకం, యాగం నిర్వహించడానికి ప్రత్యేకంగా యాగశాలను నిర్మించారు. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కోటి లింగాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ప్రధమ పూజను డాక్టర్‌ టి.సుబ్బరామిరెడ్డి నిర్వహించగా అక్కడి నుంచి మంత్రి గంటా, ముక్కాముల స్వామీ, సినీ ప్రముఖులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, మురళీ మోహన్‌ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు మాట్లాడుతూ శివ భక్తుడైన డాక్టర్‌ సుబ్బరామిరెడ్డి లోక కళ్యాణార్ధం ప్రతీఏటా బీచ్‌ వద్ద కోటి లింగాలను ఏర్పాటుచేసి పూజలు నిర్వహించడం దీనికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశాన్ని కల్పించడం అభినందనీయమన్నారు. వేలాదిమంది భక్తులు తరలి వచ్చినా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేని విధంగా నగర పోలీసులు ఏర్పాట్లు చేయడం శుభపరిణామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్‌, పీసీసీ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, పెద్దఎత్తున పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. పరమేశ్వరుని దర్శించుకునేందుకు వీలుగా తెల్లవారుజామున 5.30 గంటల నుంచీ వీలు కల్పించినట్టు డాక్టర్‌ సుబ్బరామిరెడ్డి తెలిపారు. పూజా కార్యక్రమాలు అనంతరం భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. 

చిటపట చినుకులు… గుర్తుచేస్తుంటారు

‘‘నేనెక్కడ కనిపించినా తెలుగు ప్రేక్షకులు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే…’ పాటని గుర్తు చేస్తుంటారు. ‘కృష్ణార్జునయుద్ధం’లో నేను ఎన్టీఆర్‌ని చిన్నన్నయ్యా అంటుంటాను. ఆ సంభాషణని గుర్తు చేసి ఒకసారి చెప్పండని అడుగుతుంటారు. మరోసారి ఈ వేదికపై ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంద’’న్నారు ప్రముఖ నటి బి.సరోజాదేవి. ఆమెకి టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి విశాఖపట్నంలో ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదుని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘టి.సుబ్బరామిరెడ్డికి కళలన్నా, కళాకారులన్నా ఎంతో గౌరవం. శివరాత్రి రోజున ఈ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంద’’న్నారు.‘‘ఆ రోజుల్లో హీరోల్ని మించి పారితోషికం అందుకొన్న కథానాయిక బి.సరోజాదేవి. ఆమెకి తెలుగు ప్రజల తరఫున ప్రదానం చేసిన బిరుదు… ‘విశ్వనట సామ్రాజ్ఞి’’ అన్నారు టి.సుబ్బరామిరెడ్డి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ద్రోణంరాజు శ్రీనివాస్‌, పడాల అరుణ, నటుడు, ఎంపీ మురళీమోహన్‌ నటీమణులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, గాయని పి.సుశీల తదితరులు పాల్గొన్నారు.

4tollywood-7a

TSR honours B.Saroja Devi with ‘Viswanata Samragni’

బి.సరోజాదేవికి టి.సుబ్బరామిరెడ్డి ‘విశ్వనటసామ్రాజ్ఞి’ 
*మార్చి 4 మహాశివరాత్రి పర్వదినాన విశాఖలో లో వేడుక 
 
సుప్రసిద్ధ నటీమణి శ్రీమతి బి,సరోజాదేవి కి టి.ఎస్.ఆర్.లలితకళాపరిషత్ ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు తో సత్కారం. ప్రముఖ నిర్మాత, రాజకీయనాయకులు, పారిశ్రామిక వేత్త, కళాబంధు, డా:టి.సుబ్బరామిరెడ్డి మార్చి 4 మహాశివరాత్రి పర్వదినాన విశాఖలో లో వైభవంగా జరిగే వేడుక లో ఈ బిరుదు తో సత్కరించనున్నట్లు తెలిపారు. సుబ్బరామి రెడ్డి  మహాశివభక్తుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని ఆయన వైజాగ్ లో జరుపుకుంటూ వస్తున్నారు. పాతికేళ్ళుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. టీఎస్సార్ నిర్వహించే మహాశివరాత్రి లింగార్చనకు దేశవిదేశాలవాసులు సైతం హాజరవుతూ ఉంటారు. విశాఖ రామకృష్ణా బీచ్ లో మార్చి 4 సాయంత్రం ఐదు గంటల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. లక్షలాదిగా తరలివచ్చే ప్రజలచేతనే కోటి శివలింగాల ప్రతిష్ఠాపన, మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం టీఎస్సార్ కళాపీఠం ఆధ్వర్యంలో సాగుతుంది.  ఈ సందర్భంగా ప్రతి మహాశివరాత్రి నాడు కళాకారులను సన్మానించడం విధిగా నిర్వర్తిస్తున్నారాయన. ఈ యేడాది మహాశివరాత్రి నాడు మహానటి పద్మభూషణ్ బి.సరోజాదేవికి “విశ్వనటసామ్రాజ్ఙి  ” బిరుదుతో సుబ్బరామిరెడ్డి ఆమెను సత్కరించనున్నారు. టి.ఎస్.ఆర్.లలితకళాపరిషత్ ఆధ్వర్యంలో జరిగే బి.సరోజాదేవి సన్మాన కార్యక్రమంలో ప్రముఖ నటీనటులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, సుమన్, మీనా, మధురగాయని పిసుశీల వీరితో పాటు పలువురు సినీరాజకీయ ప్రముఖులు  పాల్గొననున్నారు. సాలూరి వాసూరావు సంగీతావిభావరి నిర్వహించనున్నారు. 
బి.సరోజాదేవిగారు కన్నడ నాట జన్మించినా, తెలుగువారికి సుపరిచితులు. మహానటుడు యన్టీఆర్ తమ ‘పాండురంగ మహాత్మ్యం’ ద్వారా బి.సరోజాదేవిని తెలుగుతెరకు పరిచయం చేశారు. ఆ తరువాత యన్టీఆర్ సరసన “సీతారామకళ్యాణం, జగదేకవీరుని కథ, దాగుడుమూతలు, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి-చెడు, మాయని మమత, భాగ్యచక్రము, ఉమాచండీ గౌరీశంకరుల కథ, విజయం మనదే, మనుషుల్లో దేవుడు, దానవీరశూర కర్ణ” వంటి చిత్రాల్లో నటించారు. 
మరో మహానటుడు అక్కినేని సరసన కూడా బి.సరోజాదేవి నటించి అలరించారు. ఆయనతో “పెళ్ళికానుక, ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న, వసంతసేన, రహస్యం” వంటి చిత్రాల్లో నటించారు. 
తెలుగునాటనే కాకుండా, మాతృభాష కన్నడలోనూ, తమిళ, మళయాళ, హిందీ భాషల్లోనూ సరోజాదేవి అపూర్వమైన విజయాలను సాధించారు. 
బి.సరోజాదేవి అభినయవైభవానికి ఎన్నెన్నో అవార్డులు రివార్డులు లభించాయి. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను సైతం సరోజాదేవి అందుకున్నారు.

IMG_5484

Yester years lovable heroine and great actress B.Saroja Devi is going to get another jewel in her crown, this time noted Politician and film producer ‘Kalabandhu’ Dr.T.Subbarami Reddy honours her with ‘Viswanata Samragni’ on March 4th, on the occasion of Mahasiva Ratri. Every year, T.Subbarami Reddy, he’s well known Sivabhakta, celebrates ‘Mahasiva Ratri’ in Vizag along with tens of millions of devotees from all over the globe. This time he performs ‘Koti Sivalingarchana’ and ‘Mahakubhamela’ at Ramakrishna beach of Vizag. The service will start at 5 PM on Mahasivaratri and noted music director Saluru Vasu Rao will entertain the audiences with his musical night. Noted film personalities Jamuna, Vanisri, Geetanjali, Meena, Suman and well known singer P.Suseela will participate in this great occasion along with some other prominent persons of film and political fields.

B.Saroja Devi has been in the hearts of Telugus for decades, who was introduced by legendary actor NTR with his ‘Panduranga Mahatyam’ to Telugu cinema and she got many memorable roles and paired to NTR and ANR, mesmarized the masses with her unforgettable smile.