T.S.R. LALITAKALA PARISHAT

విశాఖలో వైభవంగా జరిగిన టి.ఎస్.ఆర్ – టివి 9 సినీ అవార్డుల వేడుక

BVN_5391 BVN_5393 BVN_5399 BVN_5407 BVN_5411 BVN_5415 BVN_5423 BVN_5428 BVN_5443 BVN_5448 BVN_5450 BVN_5241 BVN_5259 BVN_5308 BVN_5241 BVN_5244 BVN_5253 BVN_5259 BVN_5266 BVN_5272 BVN_5275 BVN_5278 BVN_5283 BVN_5286 BVN_5289 BVN_5305 BVN_5308 BVN_5391 BVN_5393 BVN_5399 BVN_5407 BVN_5411 BVN_5415 BVN_5423 BVN_5428 BVN_5443 BVN_5448 BVN_5450 BVN_5466 BVN_5470 BVN_5473 BVN_5484 BVN_5485 BVN_5489 BVN_5512 BVN_5517 BVN_5520 BVN_5536 BVN_5537 BVN_5538 BVN_5541 BVN_5542 BVN_5543 BVN_5547 BVN_5549 BVN_5552 BVN_5562 BVN_5566 BVN_5570 BVN_5572 BVN_5575 BVN_5578 BVN_5581 BVN_5585 BVN_5587 BVN_5588 BVN_5591 BVN_5594 BVN_5598 BVN_5601 BVN_5606 BVN_5608 BVN_5611 BVN_5612 BVN_5615 BVN_5620 BVN_5621 BVN_5624 BVN_5626 BVN_5630 BVN_5635 BVN_5637 BVN_5640 BVN_5641 BVN_5645 BVN_5646 BVN_5649

టి.ఎస్‌.ఆర్ టీవీ 9నేషనల్‌ అవార్డుల (2017 – 2018) 5వ వార్షికోత్సవ  ప్రధానోత్సవం  ఫిబ్రవరి 17న విశాఖపట్నం లో అశేష జనవాహిని మధ్య సినీ పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో  సినీ తారల ఆట పాటలతో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆంద్రప్రదేశ్ మంత్రి వర్యులు శ్రీ ఘంటా శ్రీనివాస్ గారు హాజరయ్యారు. ఈ వేడుకలో  చిరంజీవి, మోహన్ బాబు,బాలకృష్ణ, నాగార్జున, విశాల్, తో పాటు మరెందరో  సినీ ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడం తో అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది… హీరోలందరూ సోదరభావం తోనే ఉంటాం …అని చెప్పి అభిమానులను సంభ్రమాచర్యాలకు గురిచేశారు.
ఈ కార్యక్రమాన్ని  అమర వీరులకు నివాళులు అర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా..
సాంస్కృతిక సార్వభౌమ, కళాబంధు,రాజ్యసభ సభ్యులు టి సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – “ప్రతిభాషా ప్రేక్షకులకు తమ అభిమాన నటీనటులను,ఆర్టిస్టులను, టెక్నిషన్స్ ను సత్కరిస్తుంటే వారు ఎంతగానో ఆనందిస్తారు. అందుకని ఎంతో కృషితో రాత్రింబవళ్లు కష్టపడి టీవీ9 సహాయంతో  ఈ అవార్డ్స్ లను ప్రకటించడం జరిగింది. నాకు అభినందనలు కాదు …కళాకారుల ఆనందం కావాలి అందుకే గత 20 సంవత్సరాలనుండీ ఎన్నో ఆధ్యాత్మిక,
సాంస్కృతిక,సామాజిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను మీ అందరి సంతోషమే నా శక్తి. ఒకే వేదికపై చిరంజీవి,మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున,విశాల్ లాంటి హీరోలను చూడడం కన్నుల పండుగగా ఉంది. భారత దేశ చరిత్రలో ఏ అవార్డ్ ల ఫంక్షన్ కూడా ఇలా ప్రజల సమక్షంలో జరగలేదు. అభిమానుల ఆనందం నాకు టానిక్ లాంటిది. కళాకారుడు ఈశ్వరునితో సమానం. వారిని ప్రోత్సహించడం అంటే ఈశ్వరున్ని ప్రోత్సహించడమే”అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – ” మంత్రి వర్యులు శ్రీ ఘంటా శ్రీనివాస్ గారికి,సోదరుడు బాలక్రిష్ణ కి ,నా మనసుకు చాలా దగ్గరైన మోహన్ బాబు, నాగార్జున గారికి అలాగే అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమ సూత్రధారి టి సుబ్బరామిరెడ్డి గారికి,ఆయనకు సహకరించిన రఘురామ రాజు గారికి నా హృదయ పూర్వక వందనాలు.
ఆహ్లాదకరమైన వాతావరణం,అందమైన సముద్ర తీరం, అంతకుమించి మంచి మనసున్న మనుషులు ఉంటారు కనుకనే విశాఖకు వచ్చే ఏ అవకాశం వదులుకొను. కళాకారుణ్ణి ప్రోత్సహించడం ద్వారా ఆతనికి కలిగే ఆనందంలోని శక్తిని నేను పొందుతాను అని చెప్పిన మహోన్నత వ్యక్తి సుబ్బిరామిరెడ్డి గారు.ఇంత మంది హీరోలను ఒకే స్టేజీ పై ఉంచడం ఆయనకే సాధ్యమైన పని. ఇక్కడికి ప్రతీ ఒక్కరూ ఆయన మీద అభిమానంతో ఎంతో ఇష్టంతో వచ్చారు. మా అందరి మధ్య సోదరానుబంధం ఉందని ప్రతి ప్రేక్షకునికీ తెలియచెప్పే తరుణం ఇది “అన్నారు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ – “మంత్రి ఘంటా శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్న సోదరులకు, ఆత్మీయుడు, కళాబంధు, టి సుబ్బరామిరెడ్డి గారికి నా హృదయ పూర్వక నమస్కారాలు. ప్రతీ కళాకారుని హృదయంలో నాకు చోటుంటే చాలు అన్న మహోన్నత వ్యక్తి ఆయన.ఆయన పాల లాంటి వారు ఎవరికీ ఏం కావాలో అది తీసుకోవచ్చు. ఆయన నిండు నూరేళ్ళ ఆయుష్షుతో పూర్తి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. దాసరి గారు ఒకటి నుండి వంద వరకు ఆయనే…ఆయన లేకపోవడం సినిమా పరిశ్రమకి తీరని లోటు..ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి”అన్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ – ” ప్రశాంత సాయం సమయాన..చల్లటి విశాఖ సముద్ర తీరాన ఈ కార్యక్రమానికి హాజరైన అతిరథమహారధులు అందరికి నా హృదయ పూర్వక వందనాలు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఒక బృహత్తర కార్యాన్ని నిర్వహించడం ఆశా మాషీ విషయం కాదు. ఈ కార్యక్రమంలో అందరినీ ఒకే వేదిక పై కలపడం ఒక్క టీ ఎస్ ఆర్ గారికే చెల్లింది. ఆయన అజాత శత్రువు ఒక్క పిలుపునిస్తే అందరం హాజరవుతామ్.అభిమానులకు ఎన్నో మంచి సినిమాలు ఇవ్వమని వెన్ను తట్టి ముందుకు నడిపేదే …టి ఎస్ ఆర్ టీవీ9  అవార్డ్”అన్నారు.

కింగ్ నాగార్జున మాట్లాడుతూ – “అందమైన మనుషులు, అన్నయ్యలందరు స్టేజ్ మీదనే ఉన్నారు.నాకు చాల ఇష్టం అయిన రంగస్థలం, మహానటి, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలకు అవార్డులు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు టి సుబ్బరామిరెడ్డి గారికి కృతజ్ఞతలు”అన్నారు.

హీరో విశాల్ మాట్లాడుతూ – ” సినీ పరిశ్రమ లెజెండ్ లందరికి నా నమస్కారాలు. వీరందరి ఫోటోలు నా కబోర్డు పైన ఉంటాయి.అలాంటిది అందరిని ఒకే వేదికపై కలిపిన టి ఎస్ ఆర్ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. అందరూ బాగుండాలి…వీలున్నంత వరకు సమాజానికి తోడ్పడాలి”అన్నారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – “తెలుగు సినిమా రాజులు అందరూ ఉన్న వేదికకు నా నమస్కారం. నాలాంటి కళాకారులు ఇంకా అవార్డులు తీసుకోవడం కొత్త తరం దర్శకుల సహకారంతోనే సాధ్యం. నటులకే నచ్చే సినిమాలు తీయడం వాటికి అవార్డులు ఇవ్వడం అంటే మాములు విషయం కాదు.. దేశ ఔన్నత్యాన్ని తెలియజేసే కలయిక ఇది”అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సిరివెన్నెల, విద్యాబాలన్ తో పాటు అవార్డు గ్రహీతలందరూ పాల్గొని టి సుబ్బరామిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

స్పెషల్‌ అవార్డ్స్‌

1. నేషనల్‌ స్టార్‌ శ్రీదేవి మెమోరియల్‌ అవార్డ్‌ – విద్యాబాలన్‌

2. దాసరి నారాయణరావు మెమోరియల్‌ అవార్డ్‌ – మోహన్‌బాబు

3. స్టార్‌ ప్రొడ్యూసర్‌ అవార్డ్‌ – బోనీకపూర్‌

4. లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డ్‌ – నగ్మా

5. అవుట్‌ స్టాండింగ్‌ సినీ లిరిక్‌ రైటర్‌ అవార్డ్‌ – సిరివెన్నెల సీతారామశాస్త్రి

6. జ్యూరి అవార్డ్‌ ”86 వసంతాల తెలుగు సినిమా” బుక్‌
రచయిత: డాక్టర్‌ కె. ధర్మారావు

టి.ఎస్‌.ఆర్ టీవీ 9నేషనల్‌ అవార్డు -  2017

1. బెస్ట్‌ యాక్టర్‌ – బాలకృష్ణ (గౌతమిపుత్ర శాతకర్ణి),
2. బెస్ట్‌ యాక్ట్రెస్‌ – రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (రారండోయ్‌ వేడుక చూద్దాం)
3. బెస్ట్‌ హీరోయిన్‌ – రాశి ఖన్నా (జై లవకుశ, రాజా ది గ్రేట్‌)
4. బెస్ట్‌ హీరోయిన్‌ డెబ్యూట్‌ – షాలిని పాండే (అర్జున్‌రెడ్డి)
5. బెస్ట్‌ ఫిల్మ్‌ – గౌతమిపుత్ర శాతకర్ణి (రాజీవ్‌ రెడ్డి, సాయిబాబ)
6.మోస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌ – ఖైది నంబర్‌ 150 (రామ్‌చరణ్‌)
7. బెస్ట్‌ డైరెక్టర్‌ – క్రిష్‌ జాగర్లమూడి (గౌతమిపుత్ర శాతకర్ణి)
8. మోస్ట్‌ పాపులర్‌ డైరెక్టర్‌ – వి.వి. వినాయక్‌ (ఖైది నంబర్‌ 150)
9. బెస్ట్‌ క్యారెక్టర్‌ యాక్టర్‌ – ఆది పినిశెట్టి (నిన్నుకోరి)
10. బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ – దేవిశ్రీప్రసాద్‌ (ఖైది నంబర్‌ 150)
11. బెస్ట్‌ సింగర్‌ (మేల్‌) – దేవిశ్రీప్రసాద్‌ (అమ్మడు లెట్స్‌ కుమ్ముడు – ఖైది నంబర్‌ 150)
12. బెస్ట్‌ సింగర్‌ (ఫిమేల్‌) – మధు ప్రియ (వచ్చిందే – ఫిదా)
13. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – రాజశేఖర్‌ (పిఎస్‌వి గరుడవేగ)
14. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – సుమంత్‌ (మళ్ళీ రావా)
15. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – అఖిల్‌ (హలో)
16. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ – నరేష్‌ వి.కె. (శతమానం భవతి)
17. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – రితికా సింగ్‌ (గురు)
18.స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ ఫిిల్మ్‌ – ఫిదా (దిల్‌ రాజు, శిరీష్‌)
19. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – డైరెక్టర్‌ – లేట్‌ బి. జయ (వైశాఖం)
20. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ సింగర్‌ (మేల్‌) – మనో (పదమరి, పైసా వసూల్‌)
21. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ సింగర్‌ (ఫిమేల్‌) – సోని (హంసనావ.. బాహుబలి2).

టి.ఎస్‌.ఆర్ టీవీ 9నేషనల్‌ అవార్డు -  2018

1.బెస్ట్‌ యాక్టర్‌ – నాగార్జున (దేవదాస్‌)
2. బెస్ట్‌ హీరో – రామ్‌చరణ్‌ (రంగస్థలం)
3. బెస్ట్‌ హీరో డెబ్యూట్‌ – కళ్యాణ్‌ దేవ్‌ (విజేత)
4. బెస్ట్‌ క్యారెక్టర్‌ యాక్టర్‌ – రాజేంద్ర ప్రసాద్‌ (మహానటి)
5. బెస్ట్‌ కమెడి యన్‌-ఆలీ (నేల టిక్కెట్‌)
6. బెస్ట్‌ యాక్ట్రెస్‌ – కీర్తి సురేష్‌ (మహానటి)
7. బెస్ట్‌ హీరోయిన్‌ – పూజాహెగ్డే (అరవింద సమేత)
8. బెస్ట్‌ హీరోయిన్‌ డెబ్యూట్‌ – ప్రియాంక జవాల్కర్‌ (టాక్సీవాలా)
9. బెస్ట్‌ ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌ – సాయి తేజస్విని (మహానటి)
10. బెస్ట్‌ ఫిల్మ్‌ – మహానటి (సి. అశ్వనీదత్‌, స్వప్న దత్‌, ప్రియాంక దత్‌)
11. మోస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌ – రంగస్థలం (నవీన్‌, రవిశంకర్‌, మోహన్‌)
12. బెస్ట్‌ డైరెక్టర్‌ – నాగ్‌ అశ్విన్‌ (మహానటి)
13. మోస్ట్‌ పాపులర్‌ డైరెక్టర్‌ – సుకుమార్‌ (రంగస్థలం)
14. బెస్ట్‌ డైరెక్టర్‌ డెబ్యూట్‌ – వెంకీ అట్లూరి (తొలిప్రేమ)
15. బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ – థమన్‌ (అరవింద సమేత)
16. బెస్ట్‌ సింగర్‌ – మేల్‌ – అనురాగ్‌ కులకర్ణి (మహానటి… మహానటి)
17. బెస్ట్‌ సింగర్‌ – ఫిమేల్‌ – ఘంటా వెంకటలక్ష్మీ (జిగేల్‌ రాణి…. రంగస్థలం)
18. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (జయ జానకి నాయక)
19. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – నాగ చైతన్య (శైలజా రెడ్డి అల్లుడు)
20. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – కళ్యాణ్‌ రామ్‌ (నా నువ్వే)
21. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – సుప్రియ (గూఢ చారి)
22. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ డైరెక్టర్‌ – పరశురామ్‌ (గీత గోవిందం)
23. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ ఫిల్మ్‌ – తొలిప్రేమ (బి.వి.ఎస్‌. ఎన్‌. ప్రసాద్‌)
24. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ సింగర్‌ (ఫిమేల్‌) – మోహన భోగరాజు (అరవింద సమేత)

అవార్డ్స్‌ ఇన్‌ అదర్‌ లాంగ్వేజెస్‌

1. బెస్ట్‌ యాక్ట్రెస్‌ – హిందీ (పద్మావత్‌)
అండ్‌ స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – తెలుగు (సమ్మోహనం).
2. అవుట్‌ స్టాండింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌ యాక్ట్రెస్‌ – తమిళ్‌ (ఖుష్బూ).
3. బెస్ట్‌ యాక్ట్రెస్‌ – తమిళ్‌ కేథరీన్‌ థెస్రా (కథానాయకన్‌ – 2017)

4. బెస్ట్‌ యాక్ట్రెస్‌ – కన్నడ ప్రియమణి (ద్వజ – 2018)

5. బెస్ట్‌ యాక్ట్రెస్‌ – పంజాబి జోనిత (శాంకి డరోగ – 2018)

6. బెస్ట్‌ యాక్టర్‌ – భోజ్‌పురి రవికిషన్‌ (శహన్‌షా – 2017

Not only the artists from Telugu film industry, the actors from across the nation were recognised for their talent during the prestigious TSR-TV9 National Film Awards for 2017-19 held here on Sunday night.

 Telugu actors Balakrishna and Nagarjuna have received the best actor awards for the films Gauthamiputra Satakarni and Devadas respectively. Rakul Preet Singh and Keerthi Suresh bagged best actress awards for Raarandoy Veduka Chuddam and Mahanati respectively.

 Mahanati has won most of the awards in various categories. Star producer Ashwini Dutt’s daughter Priyanka Dutt has received the best producer award for the film, while her husband Nag Ashwin got the best director award in 2018.

 Rajendra Prasad was awarded as best character actor for his performance in Mahanati and his grand daughter Sai Tejwaswini also won an award in best child artist category for the same film.

 Meanwhile, the Sridevi Memorial Award went to Vidya Balan and Dasari Narayana Rao Memorial Award to Mohan Babu. He shared his award with Chiranjeevi as he casually said that no award was announced to him.

 However, the mega star has taken the awards received by Ram Charan Tej on his behalf and expressed his happiness. Ram Charan Tej was awarded as the best hero 2018 for his movie Rangasthalam. He also received best producer 2017 for his film Khaidi No 150.

 Chiranjeevi and Mohan Babu were given awards from the hands of state HRD minister Ganta Srinivasa Rao. Other South Indian stars such as Vishal and Khushbu also bagged awards for their outstanding performances in Tamil films. 

 Port Trust Stadium was overcrowded by young and old people, who came from several places to watch TSR National Film Awards held here on Sunday. Thousands of people attended the event to see their favourite actors and actresses.

 Though the event was scheduled to start by evening 6 pm, people have started coming to the venue from 2 pm onwards to sit in the front rows. They didn’t care the hot sun and waited for the stars entry up to 8 pm. The young audience welcomed each actor by shouting their names.

 Film stars Chiranjeevi, Balakrishna, Nagarjuna and Sumanth came together and enthralled the viewers. At the same time, heroines Rakulpreet Singh, Rasi Khanna and Aditi Rao Hydari entered the venue. Later, Vidya Balan, Khushbu, Catherine and other heroines arrived.

 Ch Someshwara Rao, a 70-year old person, came actively with all his family members including his grand children to watch the awards night. He was excited to see Balakrishna, the son of his favourite hero late NT Rama Rao

 Some students felt happy when an elite family has given their extra passes to them.

 Soon after inaugurating TSR National Film Awards, TSR Lalitha Kala Parishath chairman T Subbarami Reddy urged everyone to observe a two-minute silence to pay their homage to Pulwama martyrs.

 All the audience including the film stars stood for a while and paid tribute to the CRPF jawans who were martyred in a suicide bomb attack in Jammu and Kashmir on Thursday. All the actors have come together to raise their voice against terrorism.

 Mega star Chiranjeevi has condemned the terrorist attack, and urged the public to remember the sacrifices of the brave soldiers. Balakrishna also condemned the attack on CRPF personnel and expressed solidarity to their family members.

 Condemning the attack, acclaimed lyricist Padma Shri Sirivennela Seetharama Sastry highlighted the necessity to stay united against the terrorism in the country. Not only war and cricket, even movies can also bring together with a possessive feeling towards the country. 

 

TSR National Film Awards PRESS MEET

 

 KUM_3280 KUM_3296 KUM_3513TSR Award function to be held on Feburary 17, at Visakhapatnam

Stage is set for the TSR Awards for the year 2017 and 2018. Former MP and filmmaker T Subbarami Reddy and his daughter Pinky Reddy have organised a press meet at Hotel Park Hyatt on Saturday and have announced that award function is going to be held in Visakhapatnam on February 17, at 5 pm. At the press meet, actors Nagma, Meena, Naresh, writer Parcuhuri Murali and others were present, as they are the members of the jury. The awards are given T Subbarami Reddy under the Lalithakala Parishath which was instituted by him in the year 2010. Like every year, this function will be held in the presence of around one lakh people. Other members of the jury are Shobhana Kamineni, Jeevitha, KS Rama Rao (producer) and K Raghurama Krishnam Raju (film critic). The nominations for the awards were also unveiled at this press meet. At the same time, it was also announced that Bollywood diva Vidya Balan will be presented the Sridevi Memorial Award. Actors like Chiranjeevi, Rajinikanth, Nagarjuna, Venkatesh, Surya, Shatrughan Sinha, etc. from the other industries will also be attending the awards function.

ఫిబ్రవరి 17న వైజాగ్ లో టి.ఎస్.ఆర్. – టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2017, 2018టి.ఎస్.ఆర్. – టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కు విశాఖ పట్నం మరోసారి వేదిక కాబోతోంది. 2010 నుండీ రెండేళ్ళకు ఒకసారి  కళాబంధు, సాంస్కృతిక సార్వభౌమ టి. సుబ్బరామిరెడ్డి ఈ అవార్డులను జాతీయ స్థాయిలో అందిస్తున్నారు. ఫిబ్రవరి 17వ తేదీ విశాఖపట్నం, పోర్ట్ గ్రౌండ్ లో వేలాదిమంది సమక్షంలో ఘనంగా 2017, 18 ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని జరుపుబోతున్నట్టు శనివారం టి. సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జ్యూరీ ఛైర్మన్ సుబ్బరామిరెడ్డితో పాటు సభ్యులు డా. శోభనా కామినేని, పింకీరెడ్డి, నగ్మా, మీనా, పరుచూరి గోపాలకృష్ణ, నరేశ్, కె.ఎస్. రామారావు పాల్గొన్నారు. వీరితో పాటుగా జీవిత, కె. రఘురామ కృష్ణంరాజు సైతం జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
టి. సుబ్బరామిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ, ’2010లో మొదలు పెట్టిన ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వఘ్నంగా కొనసాగించడం ఆనందంగా ఉందని, ఈశ్వర శక్తి, ప్రజల ప్రేమతో ఇది సాధ్యమౌతోంద’ని అన్నారు. శ్రీదేవి మెమోరియల్ అవార్డును విద్యాబాలన్ కు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్, సూర్య, విక్రమ్ తో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితర తారలు హాజరవుతారని అన్నారు. నెల్లూరులో పుట్టిన సుబ్బరామిరెడ్డికి హైదరాబాద్, విశాఖపట్నంతో విడదీయరాని అనుబంధం ఉందని, ఆయన ఆరాధించే శివుడి ఆజ్ఞతోనే ఈ కళాసేవ అపూర్వంగా సాగుతోందని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. తమ జ్యూరీ గౌరవప్రదంగా, అందరికీ ఆమోదయోగ్యమైన నటీనటులను అవార్డులకు ఎంపిక  చేస్తుందని నరేశ్ తెలిపారు. తెలుగు చిత్రసీమకు చెందిన అనేక మందికి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి టి. సుబ్బరామిరెడ్డి కారకులని కె.యస్. రామారావు చెప్పారు. భారతీయ కళలు, సంస్కృతికి సేవ చేస్తున్న గొప్ప వ్యక్తి సుబ్బరామిరెడ్డి అని నగ్మా అన్నారు. గతంలో అవార్డుల కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యానని, ఆ తర్వాత ‘దృశ్యం’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నానని, ఇప్పుడు జ్యూరీలో ఉండటం ఆనందంగా ఉందని మీనా తెలిపారు. రాజకీయ, పారిశ్రామిక, కళా రంగాలలో తనదైన ముద్ర వేసిన టి. సుబ్బరామిరెడ్డి జీవితాన్ని బయోపిక్ గా రూపొందించాల్సిన అవశ్యకత ఉందని శోభనా కామినేని అభిప్రాయపడ్డారు. తన తండ్రికి వేరెవ్వరూ సాటిరారని, అతి త్వరలోనే ఆయన ఆటోబయోగ్రఫీని విడుదల చేయబోతున్నామని పింకీ రెడ్డి చెప్పారు.

పద్మశ్రీ బ్రహ్మానందానికి ‘హాస్యనట బ్రహ్మ’ బిరుదు ప్రదానం

BGP_0646 BGP_0705 BGP_0753 BGP_0759 BGP_0796 BGP_0925 BGP_0948 BGP_0160 BGP_0164 BGP_0242 BGP_0244 BGP_0383 BGP_0517 BGP_0577 BGP_0628

మహబూబ్ నగర్ లో వైభవంగా జరిగిన డా:టి. సుబ్బరామిరెడ్డి కాకతీయ లలితా కళాపరిషత్, కాకతీయ కళా వైభవ మహోత్సవం వేడుక 

  కాకతీయ కళావైభవానికి రాజకీయంతో సంబంధం లేదని, కళలను ప్రోత్సహించేందుకే దానిని ఏర్పాటు చేసినట్లు కాకతీయ లలిత కళా పరిషత్‌ ఛైర్మన్‌ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందానికి ‘హాస్యనట బ్రహ్మ’ పురస్కారంతో ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. 

హాస్యనటుడు బ్రహ్మనందం సార్థక నామధేయుడని, ఆయన పేరులోనే ఆనందం ఉందని తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి పేర్కొన్నారు. యావత్‌ జాతికి హాస్యాన్ని పంచుతున్న మహానటుడని కొనియాడారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం రాత్రి టీఎస్‌ఆర్‌ కాకతీయ లలితా కళాపరిషత్‌ ఆధ్వర్యంలో కాకతీయ కళా వైభవ మహోత్సవం నిర్వహించారు. 1100 చిత్రాలు పూర్తి చేసుకున్న బ్రహ్మానందంకు సంస్థ ఆధ్వర్యంలో ‘హాస్యనటబ్రహ్మ’ బిరుదును ప్రదానం చేశారు. బ్రహ్మానందం చేతికి మధుసూధనాచారి బంగారు కంకణం తొడిగి వీణను, జ్ఞాపికను బహూకరించారు. సభాపతి మాట్లాడుతూ.. కాకతీయ కళా వైభవం కార్యక్రమాల ద్వారా కాకతీయుల కీర్తిని విశ్వవ్యాప్తం చేయడానికి సుబ్బరామిరెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. బ్రహ్మానందం, కార్యక్రమ నిర్వాహకుడు, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి జిల్లాలో కాకతీయ కళా వైభోత్సవాలు నిర్వహిస్తానన్నారు.

ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగువారి సత్తా శక్తిని అందరికీ తెలియజేస్తానని, తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లోనూ కాకతీయ కళావైభవోత్సవాన్ని నిర్వహిస్తానని అన్నారు. బ్రహ్మానందం నటనకు జీవం పోస్తారని, ఆయన ఓ జీనియస్‌ నటుడని కితాబిచ్చారు. 1100 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించిన గొప్ప నటుడని పేర్కొన్నారు.

ఎంపీ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ కళ ఈశ్వరశక్తిగా భావించాలన్నారు. 700 ఏళ్ల క్రితం ఇక్కడ కాకతీయ వైభవం సాగింది. తెలుగుజాతి కళావైభవాన్ని మహోన్నతస్థాయికి తీసుకపోయిన మహానీయులు కాకతీయులు అని కొనియాడారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ బ్రహ్మానందం నటనా ప్రతిభకు పాలమూరులో సన్మానించటం మరువలేని  అనుభూతిగా అభివర్ణించారు. 

ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘పాలమూరు ప్రజలకు కన్నుల పండగ చేసేందుకు వచ్చిన సినీ ప్రముఖులకు ధన్యవాదాలు. ఇది మామూలు కార్యక్రమం కాదు. కాకతీయ కళా వైభవ మహోత్సవాన్ని హైదరాబాద్‌ శిల్ప కళావేదికలో నిర్వహించిన తర్వాత వరంగల్‌లో చేస్తానని సుబ్బరామిరెడ్డిగారు నాతో అన్నారు. కానీ, పాలమూరు ప్రజల కోసం ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరా. బ్రహ్మానందం గారితో 1992లో ‘ప్రేమ ఎంతమధురం’అనే సినిమాను నేను తీస్తే దానిలో ఆయన నటించారు. విదేశాల్లో 25ఏళ్లు ఉన్న తర్వాత 1996లో నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. అప్పుడు జీవిత రాజశేఖర్‌ ఎనిమిది నెలల గర్భిణి ఉండి కూడా నా తరపున ప్రచారం చేశారు. వారి అందించిన సహకారం మర్చిపోలేనిది.  ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ కళాలకు ప్రాంతాలతో సమానంలేదని, కళాకారులను తెరాసా ప్రభుత్వం సముచితమైన గౌరవం ఇస్తుందన్నారు. కేంద్ర మాజీమంత్రి సూదిని జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ గొప్పనటుడు బ్రహ్మనందాన్ని పాలమూరు వేదికగా సన్మానించటం అభినందనీయమన్నారు.   ఇక్కడ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుబ్బరామిరెడ్డిగారికి ధన్యవాదాలు’’ అని అన్నారు.

 
సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.. సినీ ప్రముఖుల హాజరు పాలమూరువాసులను ఆనందాన్ని పంచింది.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడితో పట్టణం పులకించింది.. టీఎస్‌ఆర్‌ కాకతీయ లలిత కళా పరిషత్తు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైధానంలో కాకతీయ కళా వైభవ మహోత్సవం కన్నులపండువగా కొనసాగింది. ఎంపీ సుబ్బరామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సినీనటుడు బ్రహ్మానందంను హాస్య నటబ్రహ్మ పురస్కారంతో సత్కరించారు. 
శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రి జూపల్లి, ప్రణాళిక విభాగం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితోపాటు వంశీచంద్‌రెడ్డి, సినీ నటుడు, అందోల్‌ ఎమ్మెల్యే బాబుమోహన్‌, పురపాలిక ఛైర్‌పర్సన్‌ రాధ, నటులు జయప్రద, జీవిత, రాజశేఖర్‌, శ్రద్ధాదాస్‌, అలీ, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎల్లూరి శివారెడ్డి, గోరటి వెంకన్న, జంగిరెడ్డి, నీరజాదేవి, పద్మాలయ ఆచార్య తదితరులను  శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.జడ్పీ ఛైర్మన్‌ భాస్కర్‌ మాట్లాడుతూ సినీమాలపై ఉన్న తన మక్కువను వేదికపై పంచుకున్నారు. హమాలీ పని చేసే తనకు సినిమాలతోనే ఆహ్లాదం ఉండేదని చెప్పారు. బాద్మి శివకుమార్‌, లయన్‌ విజయ్‌కుమార్‌, వంశీరామరాజు, ధర్మారావు, మనోహర్‌రెడ్డి, లయన్‌ నటరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Will take glory of Kakatiyas beyond Telangana: TSR

Dr T Subbarami Reddy, Member of Parliament, in his address on the occasion of felicitating Tollywood comedian Dr K Brahmanandam in ‘Kakatiya Kala Vaibhava Mahotsavam’ held in Mahabubnagar town on Sunday, said such programmes to celebrate the art and culture of Kakatiyas would be held not only in every district across Telangana, but also in major cities of Andhra Pradesh, Maharashtra, Karnataka and Tamil Nadu, as the Kakatiya dynasty was spread across all these States around 700 years ago.

Describing the sculptures which were carved during the reign of Kakatiya rulers as magnificent art forms which emanated power from within, he said that even Sri Krishnadevaraya was inspired by such art forms.

 He made it clear that there was no politics in celebrating the grandeur of the Kakatiya art and culture.

AP Jithender Reddy, Mahabubnagar MP, speaking on the occasion, said that there was a time when people used to make fun of Telangana dialect, but after the formation of Telangana, Chief Minister K Chandrashekar Rao had taken the dialect to the world stage by conducting Telugu Maha Sabha in a grand way.

Mahabubnagar MLA V Srinivas Goud reminded everyone that it was the wonderful engineering of Kakatiya rulers that Telangana could get so many irrigation tanks which were still intact and were the main source of irrigation for the State.

Jayaprada, Shraddha Das, Jeevitha, Babu Mohan, Srinivas Reddy, Raghu Babu, Aali, former MP Jaipal Reddy, MLC Ponguleti Srinivas Reddy, Nagarkurnool MP Nandi Yellaiah, Devarkadra MLA Alla Venkateshwar Reddy, Municipal Chairperson Radha Amar and several eminent personalities attended the event.

 

పద్మశ్రీ అవార్డు గ్రహీత, డా. బ్రహ్మానందంకు హాస్యనట బ్రహ్మ బిరుదు

1100 చిత్రాల్లో కమెడియన్‌గా నటించి మెప్పించిన నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత, డా. బ్రహ్మానందంకు హాస్యనట బ్రహ్మ అనే బిరుదును కాకతీయ కళావైభవ మహోత్సవంలో ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో…

టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ”కాకతీయ లలిత కళాపరిషత్తు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వైభవంగా అప్పటి కాకతీయుల ఖ్యాతిని తెలియజేయాలనే ఉద్దేశంతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సభాపతి సిరికొండ మధుసూదనాచారి, ఎస్‌.జైపాల్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతుంటే.. జూపల్లి కృష్ణారావు, డా.సి.లక్ష్మారెడ్డి తదితరులు గౌరవ అతిథులుగా హాజరు కానున్నారు. చలన చిత్ర పరిశ్రమకు చెందిన జయప్రద, డా.రాజశేఖర్‌, జీవిత, బాబూమోహన్‌, పరుచూరి గోపాలకృష్ణ, అలీ, కవిత, కేథరిన్‌ థ్రెసా, హంసానందిని, శ్రద్ధాదాస్‌, పృథ్వీ, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి తదితరులను కాకతీయ పురస్కారాలతో సత్కరిస్తాం. అలాగే మహబూబ్‌ నగర్‌కు చెందిన సాహిత్య, సంగీత, నృత్య కళాకారులు ప్రొడ. ఎల్లూరి శివారెడ్డి, కపిలవాయి లింగమూర్తి, గొరేటి వెంకన్న, చిక్కా హరీశ్‌, జంగిరెడ్డి, పద్మాలయా ఆచార్య, వంగీశ్వర నీరజ తదితరులను కాకతీయ అవార్డుతో సత్కరిస్తాం” అన్నారు.

శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ – ”బ్రహ్మానందం గొప్ప నటుడు. తెలుగు రాష్ట్రాల్లో మరచిపోలేని నటుడు. కళాకారులకు, కవులకు, నటులకు కుల, మత, ప్రాంతీయ బేదాలుండవు. కని వినీ ఎరుగని రీతిలో ఈ కార్యక్రమాన్ని సక్సెస్‌ చేస్తాం” అన్నారు.

అలీ మాట్లాడుతూ – ”కళాకారులంటే నటరాజుకి చాలా ఇష్టం. ఆ నటరాజు సుబ్బరామిరెడ్డిగారి రూపంలో వచ్చారు. ఎందుకంటే 1100 సినిమాలు పూర్తి చేసుక్ను మా అన్న బ్రహ్మానందంకు బిరుదునిచ్చి సత్కరించడం గొప్ప విషయం. మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో 1100 సినిమాలు చేయడం గొప్ప విషయం” అన్నారు.

డా.బ్రహ్మానందం మాట్లాడుతూ ”కళలకు ఎల్లలు లేవు. కళల్లో ఈశ్వరత్వం ఉంటుంది. అలాంటి ఈశ్వరుడ్ని పూజించే సుబ్బరామిరెడ్డిగారు ఈ అవార్డు వేడుకలు నిర్వహిస్తుండటం గొప్ప విషయం. ఆ దేవుడి దయ వల్ల ఎన్నో అవార్డులను స్వీకరించినప్పటికీ.. రేపు నేను తీసుకోబోయే అవార్డు విశిష్టమైందని భావిస్తున్నాను. అది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను” అన్నారుnew doc 2018-03-09 11.47.31_1 1 (1) 1 (5) 1 (2) 1 (3) 1 (4)

శ్రీదేవి జ్ఞాపకాలలో చిత్ర పరిశ్రమ ప్రముఖులు

 1111 (1) 1111 (2) 1111 (3) 1111 (4) 1111 (5) 1111 (8) 1111 (9) 1111 (10) 1111-(6) 1111-(7)

దక్షిణాదితో పాటు ఉత్తరాది సినిమాలో కూడా నటిగా తనదైన ముద్రను చూపించి 300 సినిమాల్లో నటించి మెప్పించిన నటీమణి శ్రీదేవి. ఇటీవల ప్రమాదవశాతు దుబాయ్‌లో ఆమె కన్నుమూశారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌ పరిశ్రమ ఆమెకు సంతాపాన్ని ప్రకటిస్తూ సంస్మరణ సభను నిర్వహించారు.  శ్రీదేవి జ్ఞాపకాలతో మరోసారి తల్లడిల్లిపోయింది తెలుగు చలన చిత్రపరిశ్రమ. ఆదివారం హైదరాబాద్‌లో టి.సుబ్బిరామిరెడ్డి కళా పరిషత్‌ ఆధ్వర్యంలో శ్రీదేవి సంతాప సభ జరిగింది. తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు నటీ   నటులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ‘శ్రీదేవి మళ్లీ శ్రీదేవిగానే పుట్టాలి’ అని అభిలషించారు. ఈ కార్యక్రమంలో కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి, కృష్ణంరాజు, జయప్రద, జయసుధ, అమల, కోటశ్రీనివాసరావు, కవిత, జీవిత, రాజశేఖర్‌, సి.కల్యాణ్‌, పి.సుశీల, నివేదాథామస్‌, బి.వి.ఎస్‌,ఎన్‌.ప్రసాద్‌, ఉపాసన, పరుచూరి గోపాలకృష్ణ, బాబూ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ”శ్రీదేవితో నాకు నలబై సంవత్సరాలుగా మంచి పరిచయం ఉంది. అలాంటి వ్యక్తి చనిపోయిందని తెలయగానే నాతో పాటు యావత్‌ భారతదేశం షాక్‌ అయింది. మా అమ్మాయితో చాలా సన్నిహితంగా ఉండేది. మంచి నటే కాదు.. మంచి హ్యుమన్‌ బీయింగ్‌. ఎంతో సరదాగా, సంప్రదాయంగా, నవ్వుతూ ఉండేది. సినీ పరిశ్రమ నుండి ఇంత మంది పెద్దలు వచ్చారంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు అమ్మాయి 70 సినిమాలకు పైగా బాలీవుడ్‌లో సినిమాలు చేయడం అంటే మాటలు కాదు. లమ్హే, చాందినీ సినిమాలను నేను, యశ్‌చోప్రాలు నిర్మించాం. మళ్లీ వచ్చే జన్మలో తెలుగు అమ్మాయిగానే పుట్టాలని కోరుకుంటున్నాను” అన్నారు. ‘‘అందరూ అనుకుంటున్నట్టు శ్రీదేవికి ఆర్థిక సమస్యలేం లేవు. శ్రీదేవి కెరీర్‌లో పుంజుకుంటున్న దశలోనే ఆమె మాతృమూర్తి చెన్నైలో స్థలాలు కొన్నారు. ‘ఈ స్థలాలు అమ్మేసి.. హైదరాబాద్‌లో ఏమైనా కొనాలా’ అని నన్ను శ్రీదేవి చాలాసార్లు సలహా అడిగేది. హిందీలో ఆమెతో రెండు చిత్రాలు నిర్మించా. అవి రెండూ బాగా ఆడాయి’’

కృష్ణంరాజు మాట్లాడుతూ – ”సాధారణంగా చచ్చినవారి కళ్లు చారడేసి అంటుంటారు. అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత వారిని ఎక్కువగా పొగుడుతూ ఉంటాం. కానీ శ్రీదేవి కళ్లు బ్రతికుండగానే చారడేసి కళ్లు అమ్మాయి అయింది. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమెతో నాలుగైదు సినిమాలే చేశాను. అద్భుతమైన నటి. కొన్ని క్యారెక్టర్స్‌ను ఆమె తప్ప మరెవరూ చేయలేరనిపించేలా నటించింది. మంచి సంస్కారం ఉన్న నటి. బొబ్బిలి బ్రహ్మాన్న సినిమాను హిందీలో తీసినప్పుడు తనే హీరోయిన్‌గా నటించింది. అడిగిన వెంటనే డేట్స్‌ అడ్జస్ట్‌ చేసి నటించింది. నాతోనే కాదు.. తను నటించిన సినిమాల్లో అందరితో మంచి సహకారాన్ని అందించింది. అన్ని భాషల్లో నటించిన శ్రీదేవిగారు అన్నింటిలో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అన్నారు.
‘‘శ్రీదేవి నన్నెప్పుడూ ‘సర్‌’ అని పిలిచేది. పెద్దలంటే ఆమెకు చాలా గౌరవం. నటిగా కొన్ని పాత్రలు ఆమె తప్ప ఎవ్వరూ చేయలేరు. ఆమధ్య కలిసినప్పుడు ‘చిత్రసీమకొచ్చి నాకు యాభై ఏళ్లు. మీకూ యాభై ఏళ్లయ్యాయి. దీన్ని ఓ వేడుకగా జరుపుకోవాలి. ఆ కార్యక్రమానికి నేను తప్పకుండా వస్తా’ అంది. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ హిందీలో తీశాం. అందులో కథా   నాయికగా శ్రీదేవి నటించింది. నేను ఫోన్‌ చేయగానే ఒప్పుకొంది. ఆ సినిమా పూర్తయ్యేంత వరకూ బాగా సహకరించింది’’

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ – ”నేను లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు తను బాలనటిగా నటించిన బడిపంతులు సినిమా చూశాను. తను నటిగా 50 ఏళ్ల అనుభవాన్ని సంపాదించుకున్నప్పటికీ నేను తనను మొదటిసారి చూసిన చిన్నపిల్ల రూపమే మనసులో నిలిచిపోయింది. తనతో ‘అనురాగదేవత’ సినిమాకు మేం తొలిసారి కలిసి పనిచేశాం. రామానాయుడుగారు ఆమెను చిత్రసీమకు దేవతను చేస్తే.. ఎన్టీఆర్‌గారు అనురాగదేవతను చేశారు. అనుభవ పూర్వకంగా స్వర్ణోత్సవం జరుపుకోవాల్సిన నటి. మళ్లీ ఆవిడ పుట్టి మనకు కనపడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

 

‘‘మన కళ్ల ముందు నుంచి శ్రీదేవి వెళ్లిపోవడం అన్యాయం. ‘అనురాగ దేవత’ షూటింగ్‌ రవీంద్ర భారతిలో జరుగుతోంటే మేం వెళ్లాం. ‘చూసుకో పదిలంగా’ అనే పాట.. ప్రేక్షకుల్లో కూర్చుని చూశాం. అదో జ్ఞాపకం. రామానాయుడు ‘దేవత’ చేశారు. ఎన్టీఆర్‌ ‘అనురాగ దేవత’ చేశారు. అలాంటి దేవత.. స్వర్ణోత్సవం జరుపుకోవాల్సిన సమయంలో కన్నీటి వీడ్కోలు ఇవ్వాల్సిరావడం బాధాకరమైన విషయం’’

 

జయప్రద మాట్లాడుతూ – ”ఈరోజు మనసులో తెలియని బాధ. శ్రీదేవి నటిగా ప్రతి విషయంలో తనకు తానే పోటీగా నిలబడింది. మేం ఇద్దరం కలిసి తెలుగు, హిందీలో 15 సినిమాలకు పనిచేశాం. ఇద్దరి మధ్య హెల్దీ మధ్య కాంపిటీషన్‌ ఉండేది. తను నిజంగా ఈరోజు మన మధ్య లేదని అంటే నమ్మలేకుండా ఉన్నాను. తను పిల్లల విషయంలో కూడా ఎంతో కేర్‌ తీసుకునేది. జాన్వీని తనంతటి హీరోయిన్‌ను చేయాలనుకునేది.‘‘తనతో పదిహేను సినిమాలు చేసుంటా. పోటా పోటీగా నటించేవాళ్లం. మామధ్య ఓ ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. అందం, నాట్యం, డైలాగ్‌.. ఇలా అన్నింట్లోనూ పోటీ ఉండేది. శ్రీదేవి అవ్వాలన్న కోరికతో చాలామంది ఈ పరిశ్రమలోకి వచ్చారు. అతిలోక సుందరి తెలియని లోకాలకు వెళ్లిపోయింది. మంచి తల్లిగా తన బిడ్డల్ని తీర్చిదిద్దాలన్న తపన ఉండేది

అమల అక్కినేని మాట్లాడుతూ – ”శ్రీదేవిగారు బ్యూటీఫుల్‌, ఫాబులస్‌ ఆర్టిస్ట్‌. అనుకోకుండా ఆమె మనల్ని విడిచి పెట్టి పోవడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అన్నారు.

పి.సుశీల మాట్లాడుతూ – ”దేవలోకం నుండి వచ్చిన సుందరిలాగా మన ముందకు వచ్చి.. మనల్ని మరపించి మళ్లీ తన లోకానికి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. తనకు 8 ఏళ్ల వయసున్నప్పుడు తన కోసం పాట పాడాను. తను హీరోయిన్‌గా నటించిన సినిమాలకు నేను పాటలు పాడాను. మనకు తీపి గుర్తులను మిగిల్చి వెళ్లిపోయారు. ఆమె మనసుకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అన్నారు. ‘‘దేవలోకంలోంచి వచ్చిన సుందరిలా మన కళ్ల మందు కదిలి.. మళ్లీ తన లోకానికి వెళ్లిపోయింది. తన ఎనిమిదేళ్ల వయసులో తనకు నేను ఓ పాట పాడినందుకు గర్విస్తున్నాను. హీరోయిన్‌గా తొలి సినిమాలోనూ నేనే పాట పాడాను. అది  భగవంతుడు నాకిచ్చిన అవకాశం’

జగపతిబాబు మాట్లాడుతూ – ”శ్రీదేవిగారు అమర్‌ రహే. ఆమె కుటుంబానికి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.

జయసుధ మాట్లాడుతూ – ”శ్రీదేవి మనకు దూరం కావడాన్ని ఆమెతో నటించిన సహనటిగా జీర్ణించుకోలేకపోతున్నాను. ఆమెతో కలిసి 9-10 సినిమాల్లో నటించాను. చైల్డ్‌ సూపర్‌స్టార్‌గా ఉన్నప్పుడు శ్రీదేవిని చాలాసార్లు చూశాను. తనతో కలిసి హీరోయిన్‌గా కూడా నటించాను. మా ఫ్యామిలీతో తనకు మంచి అనుబంధం ఉండేది. ఆమె మనసుకు శాంతి కలగాలి. ఆమె ఇద్దరి అమ్మాయిలు గొప్ప హీరోయన్స్‌గా పేరు తెచ్చుకుని, వారి తల్లి కోరికను తీరుస్తారని నమ్ముతున్నాను” అన్నారు. ‘నేనూ, శ్రీదేవి పది చిత్రాల వరకూ నటించాం. బాల నటిగా ఉన్నప్పుడు.. తనని చూడ్డానికి ప్రత్యేకంగా ఆమె ఇంటికి వెళ్లా. అలా నేను చూసిన మొదటి నటి ఆమె. మా అమ్మగారు, శ్రీదేవి అమ్మగారు మంచి స్నేహితులు. చెల్లాయి సుభాషిణితో కూడా సాన్నిహిత్యం ఉండేది. నన్నెప్పుడూ ‘జయసుధగారూ’ అనే పిలిచేది. శ్రీదేవి ప్రతి పుట్టిన రోజుకీ చెన్నై తప్పకుండా వెళ్లేదాన్ని. శ్రీదేవి మరణవార్త కలచివేసింది. నాకేదో అయిపోతోందన్న భయం వచ్చేసింది. ముంబైకి కూడా వెళ్లి చూడాలనిపించలేదు. కనీసం టీవీ కూడా చూడలేదు. చివరి సారి తన మొహం చూడాలనుకుని కేవలం ఇరవై సెకన్ల పాటు టీవీ ఆన్‌ చేశా. ఆమె పార్థివ దేహం చూస్తుంటే చిన్నప్పటి శ్రీదేవిలా కనిపించింది

సి.కల్యాణ్‌ మాట్లాడుతూ – ”శ్రీదేవిగారు చిరస్థాయిగా మన మనస్సుల్లోనే ఉన్నారు. నటిగా ఆమె ఏ రోజు ఏ నిర్మాతను, దర్శకుడిని నొప్పించలేదు. కానీ ఈ ఏడాది మన అందరినీ నొప్పించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బోనీ, జాన్వీ, ఖుషీలు సహా అందరికీ ఆ దేవుడు ఆత్మ స్థైరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

డా.రాజశేఖర్‌ మాట్లాడుతూ – ”శ్రీదేవిగారి మరణవార్త విని చాలా షాక్‌కు గురయ్యాం. ఆమె తండ్రి ఆయ్యప్పన్‌గారితో మా నాన్నకు మంచి అనుబంధం ఉండేది. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఆమె ప్రతి భారతీయుడి కుటుంబంలో భాగమైన నటి. ఆమె కుటుంబానికి ఆ దేవుడు గుండె ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

కోటశ్రీనివాసరావు మాట్లాడుతూ – ”నేను శ్రీదేవిగారితో కలిసి రెండు, మూడు సినిమాల్లో పనిచేశాను. ఆ దేవుడు నటిగా పుట్టించాడు. ఆమె యాబై ఏళ్లు నటించింది. మళ్లీ దేవుడు దగ్గరికే వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ – “జ‌గ‌దేకవీరుడు అతిలోక సుంద‌రి` స‌హా మ‌రో చిరంజీవి సినిమాలో శ్రీదేవిగారు చిరంజీవిగారితో క‌లిసి న‌టించారు. నాకు స్నేహితుడైన బోనీ క‌పూర్, శ్రీదేవిని పెళ్లి చేసుకున్న కొత్త‌లో వాళ్ల ఇంటికి వెళ్లాను. ఆ స‌మ‌యంలో ఆమె ఇల్లాలిగా చేసిన గౌర‌వం చూసి నేను స్థానువైయ్యాను. ఎందుకంటే ఆమె మ‌న దృష్టిలో ఉన్న స్థాయి వేరు కాబ‌ట్టి. నేను మ‌న‌సులో ఏడ్చాన‌ని అప్పుడు అశ్వ‌నీద‌త్‌గారితో చెప్పాను. ఆమెను మ‌ర‌చిపోలేం. రామ్‌గోపాల్ వ‌ర్మ రాసిన లేఖ ఒక‌టి ఈ మ‌ధ్య చ‌దివాను. అది చ‌దివిన త‌ర్వాత త‌ను మ‌న‌సు ఎంత మెత్త‌నైన‌ది. ఆమె గురించి వ‌ర్మ ఎంత స్ట‌డీ చేశాడోన‌ని నాకు అర్థ‌మైంది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్న త‌ర్వాత.. బోనీ కుంటుంబం వారిని దూరం చేసింది. అందుకు కార‌ణాలు ఏమైనా కావ‌చ్చు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆయ‌న‌కు ఆ కుటుంబం ద‌గ్గ‌ర కావాల‌ని.. అవుతుంద‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు. ‘‘ఓసారి బోనీకపూర్‌ ఇంటికివెళ్లా. ఓకుర్రాడు టీ తీసుకొచ్చాడు. శ్రీదేవి ఆ కప్పు తీసుకుని నా చేతుల్లో పెడుతుంటే.. ఆశ్చర్యపోయా. నా  మనసులో ఆవిడకున్న స్థాయివేరు. ఆమె కప్పు అందించడం ఒప్పుకోలేకపోయా. ఈ విషయం నాతో పాటు వచ్చిన అశ్వనీదత్‌కు చెప్పుకుంటూ కుమిలిపోయా. శ్రీదేవి మరణం తరవాత రాంగోపాల్‌ వర్మ రాసిన ఉత్తరం చదివా. వర్మ గురించి రకరకాలుగా అనుకుంటాం. కానీ వర్మ హృదయం ఎంత మెత్తనైందో తొలిసారి తెలిసింది’’     

ఈ కార్యక్రమంలో జగపతిబాబు, అమల, జీవిత, రాజశేఖర్‌, పింకి రెడ్డి, ఉపాసన, శోభనా రెడ్డి, సుమంత్‌, కోట శ్రీనివాసరావు, నరేష్‌, శివాజీరాజా, అలీ, కవిత, రేలంగి నరసింహారావు, బాబూ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.–    కార్య‌క్ర‌మంలో పాల్గొన్నవారు శ్రీదేవికి త‌మ సంతాపాన్ని తెలియ‌జేశారు.